ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కళారా నృత్యం చేస్తోంది. పశువుల్లో సంక్రమించే ఈ వ్యాధి వాటినుంచే మనుషులకు కూడా సంక్రమించిందన్న అనుమానాలు అటుంచింతే.. ఈ వ్యాధి ప్రబలకుండా అన్ని దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. అనేక దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో వ్యాధి నివారణా చర్యలకు ప్రపంచ అరోగ్య సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి ఈ వ్యాధి నష్టనివారణ చర్యలకు పూనుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని ముఖ్యనగరాలలోని జనసామర్థ్యం అధికంగా వుండే ప్రాంతాలను బంద్ చేస్తూ అదేశాలను జారీ చేశారు.
కొవిడ్ -19 కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపించాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్ మెంట్లలో భక్తులు గుంపుగా వేచి ఉంటే, కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గంటకు కేవలం నాలుగ వేల మందిని మాత్రమే అనుమతించేలా అదేశాలను జారీ చేసింది.
అంతేకాదు వసంతోత్సవంతో పాటు ఆర్జిత బ్రహోత్సవాలు, సహ్రస దీపాలంకరణ సహా పలు ఆర్జీత సేవలను కూడా రద్దు చేసింది. ఇక ఇదే క్రమంలో అటు కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. అలాగే ముంబైలోని శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేదీ మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more