కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తున్న క్రమంలో తెలంగాణలో తొలి కరోనా మరణం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఈ మరణమే దేశంలోనూ తొలి కరోనా మరణంగా నమోదు కావడంతో జాతీయ అరోగ్యశాఖ కూడా అప్రమత్తం అయ్యింది. హైదరాబాద్ లో 70 ఏళ్ల మహ్మద్ హుస్సెన్ కర్ణాటక వ్యక్తి మరణానికి కరోనానే కారణమని తేలింది. కర్ణాటకలోని కాలాబురాగీ ప్రాంతానికి చెందిన మహ్మద్ సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి తన స్వగ్రామైన కాలాబురాగీకి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన దగ్గు, జలుబు. శ్వాస సంబంధమైన సమస్యలతో బాధపడుతూ.. జ్వరం బారిన పడ్డారు. దీంతో గుల్బర్గ లోని ఓ ప్రైవేటు అసుపత్రిలో ఆయనకు చికిత్సను అందించారు.
అయినా జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో మహమ్మద్ హుస్సేస్ సిద్దిఖీని హదారాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అక్కడి నంచి నగరంలోని మరో అసుపత్రికి తరలించారు. అయితే వ్యాధి తగ్గకపోవడంతో.. కార్పోరేట్ ఆసుపత్రులు కేసు టేకఫ్ చేయకపోవడంతో ఆయనను మరో అసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. అయితే ప్రైవేటు అసుపత్రిలో చికిత్స పోందిన ఆయన వ్యాధి తగ్గకపోవడంతో ఈ నెల 9న తిరిగి తన స్వగ్రామామైన కాలాబుర్గికి అంబులెన్సఉలో వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఆయన మరణించాడు. ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి శ్రీరాములు వెల్లడించారు. అతడి మరణానికి కరోనానే కారణమని నిర్ధారణ అయినట్టు చెప్పారు. కరోనా వ్యాధికి పారాసెటమాల్ మాత్రచాలునని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఈ తరుణంలో పలు విమర్శలు వస్తున్నాయి.
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో కరోనా మరణం సంభవించడం నగర వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్కడి నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ కు వచ్చిన సాప్ట్ వేర్ ఇంజనీర్ కు వ్యాధి నయం అయ్యిందని, త్వరలోనే అతడ్ని అస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని రాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపిన 24 గంటల వ్యవధిలోనే తెలంగాణలో మరో కరోనా మరణం సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర హైకోర్టు అదేశాలను కూడా తోసిరాజుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధిపై పలు వ్యాఖ్యలు చేసింది.
కరోనా వ్యాధికి ఎలా సోకుతుందోనన్న వివరాలను చెప్పిన ప్రభుత్వం.. ఈ వ్యాధికి మాస్కులు, ఖరీదైన వైద్యం కూడా అవసరం లేదని.. మాస్కులను ఉచితంగా పంచాలని రాష్ట్ర హైకోర్టు చేసిన అదేశాలను కూడా తోసిరాజింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మరణంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు వ్యాధి మరింత మందికి సోకకుండా తక్షణ చర్యలు తీసుకుంటోంది. వ్యాధి వుందన్న అనుమానాలు వున్న వ్యక్తలను గాంధీ అసుపత్రికి తరలించి చికిత్సను అందించాలని, ఇక బస్టాండ్లు, రైల్వేస్టుషన్లతో పాటు కరోనాపై అటు గ్రామాల్లోనూ ప్రచారం చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more