టీడీపీ విశాఖ ఉత్తరం ఎమ్మోల్యే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యాంక్ షాకిచ్చింది. గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం వేసేందుకు ముహూర్తాన్ని ప్రకటించింది. మాజీ మంత్రి గంటా ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ఇవాళ పలు దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. రుణం బకాయిలను తీర్చుకునే క్రమంలో భాగంగా తనఖా పెట్టిన ఆస్తులను వచ్చే నెల అనగా ఏప్రిల్ 16న ఆస్తుల ఈ-వేలం నిర్వహించనున్నట్లు ప్రకటనల్లో పేర్కోంది. వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 15 వరకు ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ప్రకటించింది.
ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 15 లోపు నియమనిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనవచ్చని ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. గంటాకు సంబంధించిన ప్రత్యూష కంపెనీ.. ఇండియన్ బ్యాంకులో రూ.141.68కోట్లు రుణం తీసుకుంది.. ఆ అప్పు వడ్డీతో సహా రూ.221 కోట్లకు చేరింది. ప్రత్యూష కంపెనీకి గంటా గతంలో డైరెక్టర్గా ఉన్నారు. రుణం ఎగవేయడంతో ఇప్పటికే ఇండియన్ బ్యాంక్ ఆస్తులు స్వాధీనం చేసుకుంది. గంటా శ్రీనివాసరావుతో పాటూ మరో ఏడుగురు డైరెక్టర్ల ఆస్తుల వేలానిక రంగం సిద్ధం సిద్ధమైంది.
గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా ఈ రుణానికి సంబంధించినవి కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటాకు పేరిట ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఫ్లాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ఆస్తుల వేలం అంశంపై తెరపైకి వచ్చింది. దీనిపై గంటా కూడా వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆస్తుల వేలం తెరపైకి వచ్చింది. వేలానికి సంబంధించి విషయాలపై గంటా శ్రీనివాసరావు స్పందించాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more