యావత్ ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించడంతో దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తలంటిన న్యాయస్థానం.. కరోనా వైరస్ పై తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని వ్యాధి వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.
కరోనా నివారణపై ప్రభుత్వం తీసుకన్న చర్యలపై దాఖలైన పిటిషన్ పై వివరణ ఇవ్వాలంటూ కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ప్రజల కోసం ఫ్రీగా మాస్కులు, మందులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ పాలన సామాన్యులను పరిగణ తీసుకుని జరగాలని.. ఆ విధంగానే వ్యాధి వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకోవాలని అదేశించింది.
కాగా, మురికివాడల్లో చేతులు కడుక్కోవడానికి పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నారా? లేదా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సభలు, సమావేశాలకు పోలీసులు ఆలోచించి అనుమతి ఇవ్వాలని సూచించింది. లాయర్లు కూడా మాస్కులు ధరించి కోర్టుకు రావాలని కోరింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇదిలావుండగా, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపడుతున్న చర్యలను నివేదిక రూపంలో ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more