హైదరాబాద్ వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారన్న అభియోగాలపై నమోదైన కేసులో నాంపల్లి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది సయ్యద్ అబ్దుల్ కరీం తుండాను మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు నాంపల్లిలోని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారన్న అభియోగాలను నిరూపించేందుకు అధికారులు సరైన ఆధారాలు సమర్పించలేకపోయారని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కోంది.
ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ జైలులో వున్న తుండా గతంలో భారత్ లో బాంబు పేలుళ్లతో విధ్వంసాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని కేసులు నమోదయ్యాయి. లష్కరే తోయిబాకు చెందిన కరుడుగట్టిన నేరస్థుడైన తుండా.. ఆ సంస్థకు బాంబులు తయారి చేయడంతో పాటు.. వాటిని తయారు చేసే విధానాన్ని కూడా పలువురు లష్కరే తోయిబా సభ్యులకు నేర్పించారని కూడా అనుమానాలు వున్నాయి. సిసిఎస్ కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం తుండాపై విధ్వంసాలకు కుట్ర చేస్తున్నారన్న అభియోగాలతో పాటు ఆయుధాలు, పేలుడు సామాగ్రి, పాస్ పోర్టు, విదేశీ చల్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
తుండా సుమారు 40 బాంబు దాడి కేసుల్లో ప్రధాన సూత్రధారిగా, మాస్టార్ మైండ్ గా వున్నారు. అయితే 1998లో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర కేసులో ఏకంగా 28 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో తప్పించుకుని తిరుగుతున్న వారిలో తుండా ఒకడు. పాకిస్థాన్ కు చెందిన మోస్ట్ వాంటెండ్ జాబితాలో వున్న ఈ కరుడుగట్టిన నేరగాడ్ని.. ఇండో నేపాల్ సరిహద్దులోని బాన్ బాసాలో తలదాచుకుంటున్న సయ్యద్ అబ్దుల్ కరీం తుండాను 2013 ఆగస్టు 16న కేంద్ర భద్రతా బలగాలు దేశానికి తీసుకువచ్చాయి. ఈ క్రమంలో అతనిపై అంతుకుముందే నమోదైన కేసుల్లో న్యాయస్థానాలు విచారణ చేశాయి.
కాగా, ఈ కేసులో కరీంపై ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారు. దీంతో, డిఫెన్స్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, కరీంను నిర్దోషిగా ప్రకటించింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరగడమే కాదు, బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా టిఫిన్ బాక్సుల్లో బాంబులు అమర్చి హైదరాబాద్ లోని హుమాయున్ నగర్, సీసీఎస్ వద్ద, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసానికి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more