ఆన్ లైన్ మోసాలు.. అందుగలదు ఇందు లేదన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందందే గలదు.. అన్ లైన్ షాపింగ్ గోల్ మాల్.. అంటూ ఎప్పటికప్పుడు నేరగాళ్లు తమ ఉనికి చాటుకుంటున్నారు. ఇటీవల ఫూణేలోని ఓ 72 ఏళ్ల వృద్దుడు వారంతాన్ని ఎంజాయ్ చేయాలని బీర్ ను అన్ లైన్ లో అర్డర్ చేస్తే.. పాతిక వేల రూపాయలకు ఆన్ లైన్ కేటుగాల్లు టెండర్ వేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనల్లో వృద్దులో లేక గ్రామీణ నేపథ్యంలో వున్నవారు.. డిజిటల్ లావాదేవీలు తెలియని వారు మోసపోతే అర్థం కానీ.. నగరానికి చెందిన యువత కూడా ఈ మోసగాళ్ల చేతుల్లో చిక్క తమ ఖాతాలు ఖాళీ చేయించుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.
అన్ లైన్ అనగానే అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించడం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇలా అప్రమత్తంగా లేని హైదరాబాద్ కు చెందిన యువకుడు ఆన్ లైన్ లో టీషర్ట్ ఆర్డర్ చేసిన ఓ కుర్రాడు సైబర్ క్రైం నేరగాళ్ల బారినపడి లక్ష రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. మారేడ్పల్లికి చెందిన రవి ‘క్యూషాప్’ అనే వెబ్సైట్లో రూ.500 విలువైన ఓ టీషర్ట్ను ఆర్డర్ చేశాడు. బుక్ చేసిన వెంటనే రెండు రోజుల్లో షర్ట్ డెలివరీ అవుతుందని అతడి మొబైల్కు మెసేజ్ వచ్చింది. అయితే, ఐదు రోజులైనా రాకపోవడంతో క్యూ షాప్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
అతడు ఫోన్ చేసిన వెంటనే రంగంలోకి దిగిన నేరగాళ్లు.. షర్ట్ డెలివరీలో సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆర్డర్ రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరో ఐదు నిమిషాల్లో మొబైల్కు మెసేజ్ వస్తుందని, అందులో వివరాలు నమోదు చేస్తే చెల్లించిన 500 రూపాయలు వెనక్కి వస్తాయని నమ్మబలికారు. అనుకున్నట్టే ఆ తర్వాత మెసేజ్ రావడం, అందులో వివరాలు నమోదు చేయడం జరిగిపోయాయి. అయితే, ఆ తర్వాత కాసేపటికే వచ్చిన మరో మెసేజ్ చూసిన రవికి మైండ్ బ్లాంక్ అయింది. లక్ష రూపాయలు డ్రా అయినట్టు బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాడు. మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more