తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల బతుకులంటే పరచకమైందని.. మాయమాటలు, నీటి మూటల హామీలతో కాలం గడపడంలో దిట్టగా మారుతున్నారని ఎంపీ రేవంత్రెడ్డి విమర్శించారు. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పట్నం గోస కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గత ఎన్నికలకు ముందు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న తరువాత బోడ మల్లన్న అన్నట్లు.. ఎన్నికల ముందు మాత్రం ప్రజలే తనకు సర్వసం అంటూ మాట్లాడే ముఖ్యమంత్రి ఎన్నికలైన తరువాత ప్రజలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఖాజానాను ఖాళీ చేసి.. నామమాత్రపు అభివృద్ది చేసిన ముఖ్యమంత్రి అక్రమంగా సంపాధించిన నిధులతో ఎమ్మెల్యేలను, ఎన్నికలలో ఓట్లను కొంటున్నారని అరోపించారు. తాజాగా మరోమారు అక్రమంగా సొమ్ముతో ప్రజల ముందుకు వస్తున్నారని.. ఈ విషయంలో నగర ప్రజలు ఎంతో తెలివైనవారని ప్రభుత్వానినిక తెలియజేయాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా పట్టించుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
భూదేవినగర్ లో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆయన.. అనంతరం మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి పేరుతో మరోసారి మోసం చేయడానికి కేటీఆర్ పాలమూరు వెళ్లారన్నారు. ప్రజల కోసం అవసరమైతే కేసీఆర్ గల్లా పట్టి గుంజాడనికైనా తాను సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని చెప్పి పట్టించుకోలేదన్నారు. పేదల ఇళ్ల కోసం కేసీఆర్, మోదీతో కొట్లాడుతానని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ మాట తప్పారని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
సమగ్ర సర్వే ప్రకారం 30 లక్షల మందికి ఇల్లు లేవని తేల్చారన్నారు. ఎర్రవల్లి చింతమడకకు ఇచ్చినట్టుగానే అన్ని గ్రామాలకు నిధులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రజలను కెసిఆర్ మోసం చేసిన తీరును ఎండగడతామని అన్నారు. కాంట్రాక్లర్లకు 900 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి అని అన్నారు. కాంగ్రెస్ హయంలో నిర్మించిన ఇళ్లు పేదలకు ఇవ్వడం లేదని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more