జర్మనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. జర్మనీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో వున్న షీషా బార్లను టార్గెట్ చేసిన దుండగులు.. వాటిలోనికి ప్రవేశించి విఛక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. కాల్పుల అనంతరం పారిపోయిన దుండగుల కోసం పోలీసులు అలర్ట్ ప్రకటించారు. దుండగులు కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా అన్వేషణ కొనసాగిస్తున్నాయి.
జర్మనీ పోలీసులు, స్థానిక మీడియా సంస్థలు వెలువరించిన వివరాల ప్రకారం.. క్రితం రోజు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత జర్మనీలోని ఫ్రాంక్ పూట్ కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వున్న హనావ్ నగరంలోని హుక్కా బార్లను గుర్తు తెలియని సాయుధులు టార్టెట్ చేశారు. స్థానికంగా వున్న ఓ హుక్కాబారులోకి వెళ్లిన దుండగులు అక్కడున్నవారిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ముగ్గురు ఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. వెంటనే అక్కడి నుంచి మరో హుక్కా కేంద్రానికి వెళ్లిన దుండగుల ముఠా మరో హుక్కా బారుకు వెళ్లి కాల్పులు జరిపింది.
దుండగులు విఛక్షణారహితంగా కాల్పులు జరపడంతో హుక్కా బారులోని ఐదుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోగా ముగ్గురు గాయాలపాలయ్యారు. కాల్పులకు తెగపడిన గుర్తుతెలియని అగంతకులు వెంటనే ఘటనాస్థలం నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు ప్రాంతాల్లోని హుక్కా బార్లను తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు ఆధారాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నారు. దీనిని ఉగ్ర ఘటనగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా ఇలాంటి ఘటనలు జర్మనీలో జరగడం ఇదే తొలిసారి కాదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ జర్మనీ హుక్కా కేంద్రాలను టార్గెట్ చేసిన దుండగలు.. విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారని వారిలో ముగ్గురు యువతులు కాగా, మరోముగ్గురు యువకులని సమాచారం. జర్మనీలోని నైరుతి మెట్రోపోలిటిన్ సిటిలోని రాట్ ఎంసీ.6లో ఈ కాల్పుల ఘటన జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇక తాజా ఘటన అదే స్థాయిలో పునరావృతం కావడం జర్మనీ వాసులను కలవరానికి గురిచేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more