తమిళనాడులోని కోయంబత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళలోని ఎర్నాకులం నుంచి కర్నాటక రాజధాని బెంగుళూరు వెళ్తున్న కేరళ ఆర్టీసీకి చెందిన బస్సును.. కోయంబత్తుర్ నుంచి సేలం జాతీయ రహదరాపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ మార్గమద్యంలో రాంగ్ సైడ్ లో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. వీరలో ఐదురుగు మహిళలు, 14 మంది పురుషులు వున్నారు.
ఘటనా స్థలంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. మృతుల్లో బస్సు కండక్టర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో 23 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు అందోళన చెందుతున్నారు. కోయంబత్తూరు సమీపంలోని అవినాశి వద్ద ఈ తెల్లవారుజామున ఈ దారుణ దుర్ఘటన జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని, అన్ని సీట్లు బుక్ అయ్యాయని అధికారులు తెలిపారు. బాధితుల్లో చాలామంది త్రిసూర్, పాలక్కాడ్, ఎర్నాకుళానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా బెంగళూరు నుంచి తమ స్వగ్రామాలకు పయనం కాగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సులో ప్రయాణిస్తూ.. చల్లని గాలికి అదమరచి నిద్రపోతున్న ప్రయాణికులు నిద్రలోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అవినాశిలోని ఘటనాస్థలం వద్ద విషాధఛాయలు అలుముకున్నాయి.
ఇక క్షత్రగాత్రులను చికిత్సపోందుతున్న ఆసుపత్రుల వద్ద కూడా క్షతగాత్రుల ఆర్తనాధాలతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇదిలావుండగా, ప్రమాదఘటన సమాచారం అందుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించాలని పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వంతో కలిసి అవసరమైన సహాయ చర్యలు చేపడతామని తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో వున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more