వృద్దులకు తమ వారసులను చూడాలని ఆశను సజీవం చేస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తన బిడ్డను అతని తాత, నానమ్మలు కలవకుండా అడ్డుకున్న తల్లిని సున్నితంగా మందలించింది. ఫ్యామిలీ న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. అంతేకాదు తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని పక్షంలో జరిమానా కూడా కట్టాల్సివస్తుందని తీర్పును వెలువరించింది. తాత, నానమ్మలను కలవకుండా పిల్లలను ఆపడం సరికాదని.. వారిని కలిసేందుకు పిల్లలకు హక్కు వుంటుందని తీర్పును చెప్పింది.
భర్త చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని వదిలేసి, మరో వివాహం చేసుకుని వెళ్లిపోయిన మహిళ వేసిన పిటిషన్ విషయంలో కోర్టు ఈ మేర తీర్పు వెలువరిస్తూ.. భర్త తల్లిదండ్రులు వారానికోసారి తమ మనవడిని చూసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారానికో పర్యాయం వారు ఢిల్లీ నుంచి ముంబై రాలేని పక్షంలో వారు ముంబై వచ్చినప్పుడల్లా వారికి మనవడిని చూపించాలని, వారిని కలిసేందుకు వీలుకల్పించాలని న్యాయస్థానం కొడుకును కోల్పోయిన వృద్ద జీవితాలకు మనవడి ఆసరా అవసరమంటూ సంచలన తీర్పును వెలువరించింది.
ముంబైకి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త, అత్తామామలతో కలిసి ఆమె ఢిల్లీలో ఉండేది. వారికి 2009లో ఒక అబ్బాయి పుట్టాడు. అయితే ఆమె భర్త 2010లో చనిపోయాడు. తర్వాత ఆమె ఆ కుటుంబాన్ని వదిలేసి, కుమారుడిని తీసుకుని ముంబైలో తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అప్పటినుంచీ అత్తామామలను దగ్గరికి రానీయ్యలేదు. మనవడిని చూడనివ్వలేదు. అదే సమయంలో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో తమ మనవడిని చూసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ అత్తామామలు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. మనవడిని చూసుకునేందుకు వారికి అవకాశం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు తీర్పు నిచ్చింది.
ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. పెళ్లయ్యాక అత్తామామలు తనను సరిగా చూసుకోలేదని, చాలా ఇబ్బందులు పెట్టారని తన పిటీషన్ లో పేర్కోంది. తన కుమారుడు తాత, నానమ్మను ఇప్పటివరకు చూడలేదని, అందువల్ల ఇక ముందు చూసేందుకు అవకాశం ఇవ్వొద్దని కోర్టును కోరింది. కానీ ఈ వాదనలను కోర్టు తప్పుపట్టింది. అత్తామామలు సరిగా చూసుకోలేదన్న కారణంగా.. వారి మనవడిని కలవకుండా ఆపడం కుదరదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు వారు మనవడిని చూడలేకపోవడానికి తల్లిగా మీరే కారణమని స్పష్టం చేసింది. మనవడిని వారానికోసారి చూసుకోవడానికి తాత, నానమ్మలకు అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారానికోసారి వారు రాలేకపోతే.. వారు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు కలవనివ్వాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more