దేశంలోని సామాన్య ప్రజలను సుదూర ప్రాంతాలకు చౌకధరకే చేర్చే రవాణాసాధనం రైల్వే. ఇలాంటి రైల్వేలో విమానయానం తరహాలో వసతుల కల్పనతో అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది రైల్వే అనుసంధాన సంస్థ ఐఆర్సీటీసీ. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహించే వారణాసీ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించే తొలి ప్రైవేటు రైలు తేజస్.. అహ్మదాబాద్ నుంచి ముంబైకి రెండో తేజస్ రైలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మూడో ప్రైవేటు రైలు కూడా కూతకు రెడీ అయ్యింది.
ప్రదాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ రైలుకు తేజస్ అని కాకుండా ‘కాశీ మహాకాల్ ఎక్స్ప్రెస్’ నామకరణం చేసింది ఇండియన్ రైల్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). ఇలా ఎందుకూ అంటే. ఈ రైలు వారణాసిలోని కాశీ విశ్వనాధుడి నుంచి ప్రారంభమై.. ఇండోర్ లోని ఓంకారేశ్వరుడి మీదుగా మధ్యప్రదేశ్ లోని మహకాళేశ్వర్ ఆలయాన్ని కలుపుతూ ప్రయాణం సాగిస్తుంది. మూడు జ్యోతిర్లాంగాల మీదుగా ప్రయాణం సాగించే ఈ రైలుకు కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేశారు. దీంతో దేశంలో మూడో ప్రైవేటు రైలు ప్రయాణానికి రంగం సిద్ధమైంది.
ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్న ఈ రైలు ఈ నెల 16న ప్రారంభం కానుంది. ఈ రైలు సర్వీసు 20వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని అధికారులు ప్రకటించారు. కాగా, ‘కాశీ మహాకాల్ ఎక్స్ప్రెస్’ వారణాసి-ఇండోర్ల మధ్య వారానికి మూడు రోజుల పాటు సేవలను అందిచనుంది. మూడు జ్యోతిర్లింగాలైన ఓంకారేశ్వర్ (ఇండోర్, మధ్యప్రదేశ్), మహాకాళేశ్వర్ (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), కాశీ విశ్వనాథ (వారణాసి, ఉత్తర్ప్రదేశ్)లతో సహా... ఇండోర్, భోపాల్ వంటి పారిశ్రామిక, విద్యా కేంద్రాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణిస్తుందని అధికారులు వివరించారు. అంతేకాకుండా దీనిలో ప్రయాణికులకు రూ.10 లక్షల ప్రయాణ బీమా సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more