మూడు రాజధానుల పాలనా వికేంద్రీకరణ బిల్లు, రాజధాని అమరావతి అభివృద్ది మండలి ఏపీసీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై త్వరలో ఆర్డినెన్సులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శరవేగంగా పావులు కదిపిందా.? అంటే ఔననక తప్పదు. అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా చేయాలని అక్కడి ప్రజలు గత 58రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న క్రమంలో విపక్షపార్టీలకు చెక్ పెడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం చెక్ పెట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల అంశంతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అర్డినెస్సును జారీ చేస్తోందన్న వార్తలు జోరందుకున్నాయి.
శానసమండలిలో సంఖ్యాబలం వున్న విపక్ష టీడీపీ.. అభివృద్ది వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ బిల్లులకు మోకాలడ్డుతోందని భావించిన ప్రభుత్వం.. వాటిని మండలిలో అమోదం చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించి.. విఫలమైంది. దీంతో మండలిని రద్దు చేయాలన్న అమోదాన్ని కూడా కేంద్రానికి పంపింది. అయితే అప్పటికే ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన ప్రభుత్వం.. శరవేగంగా ముందుకు దూసుకెళ్లేందుకు పావులు కదుపుతోంది.
ఈ రెండు బిల్లులపై ఇక అర్డినెన్సును తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు శాసన మండలిని కూడా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోడ్ చేశారు. ఉభయ సభలకు దీర్ఘకాలిక సెలవు ప్రకటిస్తూ ఆయన బుధవారమే నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీలో అమోదం పోందిన ఈ బిల్లులను మండలిలో అమోదం లభించకపోయినా ప్రోరోగ్ చేయడం ద్వారా వాటిపై అర్డినెన్సును రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావచ్చు.
ప్రోరోగ్ అంటే ఏమిటీ.?
ప్రొరోగ్ అంటే దీర్ఘకాలిక సెలవు అని అర్థం. సభ సమావేశాలు ముగియడం లేదా పరిసమాప్తం కావడాన్ని ప్రొరోగ్ అంటారు. పార్లమెంటు ఉభయ సభలను (లోక్ సభ, రాజ్యసభ) రాష్ర్టపతి, అసెంబ్లీ, మండలిని గవర్నర్ దీర్ఘకాలిక వాయిదా వేస్తారు. తిరిగి రాష్ర్టపతి / గవర్నర్ పిలుపు ఇచ్చేంతవరకు సభలు వాయిదా పడతాయి. అయితే ప్రొరోగ్ మేర గరిష్ట సెలవు ఆరు నెలలు మాత్రమే వాయిదా పడతాయి. ఆరు నెలల తరువాత దీర్ఘకాలిక సెలవు గడువు తీరిపోయి మళ్లీ సభల్లో సమావేశాలు పునరుద్దరణ గావించబడతాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more