దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు దోషులకు వారం రోజుల వ్యవధిని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. కేటాయించిన వ్యవధిలోగా దోషులు తాము దాఖుల చేయదలుచుకున్న పిటీషన్లను న్యాయస్థానంలో సమర్పించాలని పేర్కోంది. ఈ సమయంలో దోషులు తమకు న్యాయపరంగా అర్హమైన అన్ని హక్కులను, అన్ని మార్గాలను వినియోగించుకోవాలని న్యాయస్థానం సూచించింది. దోషులు దాఖలు చేసిన పిటీషన్లపై న్యాయస్థాన తీర్పులు వెలువరిచిన తరువాత అధికారులు దోషులపై దాఖలైన డెత్ వారెంట్లపై చర్యలు తీసుకోవచ్చునని పేర్కోంది.
నిర్భయ కేసులోని దోషులకు ఉరిశిక్ష అమలులో జారీ అయిన డెత్ వారెంట్ పై స్టే విధించడాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తరుపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థాని దానిని కొట్టివేసింది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు, శిక్ష అమలలో జాప్యం జరిగేలా వ్యవహరిస్తూ.. కాలయాపన చేస్తున్నారని.. దీంతో విలువైన న్యాయస్థాన సమయం కూడా వృధా అవుతుందని సాలిసిటర్ జనరల్ తన పిటీషన్లో పేర్కోన్నారు. ఇక ఈ కేసులోని నలుగురు దోషులకు వేర్వేరు తేదీల్లో ఉరి వేయాలన్న ప్రతిపాదనను కూడా కోట్టివేసింది.
ఈ కేసులో దోషులైన నలుగురు ఒకే నేరానికి పాల్పడినందున.. ఈ తరహా కేసులలో మరణశిక్షను కూడా అందరికీ కలిపి ఒకేసారి విధించాల్సి వుంటుందని, వేర్వేరుగా శిక్షను అమలు చేయడం చట్టప్రకారం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇక ఈ కేసులో ఢిల్లీలోని పాటియాల కోర్టు జారీ చేసిన స్టేను యథాతధంగా కోనసాగిస్తూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ తాజా ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కేసులోని దోషులకు తొలుత జనవరి 22న ఉరి శిక్ష విధించాలని న్యాయస్థానం డేత్ వారెంట్ జారీ చేయగా, అది కాస్తా వాయిదా పడి ఫిబ్రవరి 1వ తేదికి చేరింది. ఇక తాజాగా జారీ అయిన డెత్ వారెంట్లపై ఢిల్లీ న్యాయస్థానం స్టే విధించింది. కాగా, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇక ఈ నెలలో దోషులకు శిక్ష అములు గ్యారంటీ అన్న సంకేతాలు వెలువడినట్లు అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more