గ్రామంలో రోడ్డు నిర్మాణానికి భూమి ఇవ్వకుండా ఎదురుతిరిగారన్న అక్కస్సుతో అక్కా చెల్లెళ్లను తాళ్లతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఆటవిక ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. మహిళ అని చూడకుండా అందులోనూ ఉపాధ్యాయురాలు అన్న కనీస మర్యాద కూడా లేకండా.. అధికార పార్టీ అండతో పాటు నలుగురు వ్యక్తల బలం వుండటంతో అమానవీయంగా అటవిక చర్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని నార్త్ దినాజ్ పూర్ జిల్లాలోని గంగారాంపూర్ గ్రామంలో నివాసం ఉండే స్మతిఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ తన తల్లి, సోదరితో నివసిస్తోంది.
ఊళ్లో పంచాయతీ రోడ్డు వేయటానికి గతంలో ఒకసారి వీరికి చెందిన భూమిలో కొంత భాగం ఇచ్చారు. అయితే గ్రామ పంచాయతీ మరోసారి రోడ్డు విస్తరణలో భాగంగా వీరికే చెందిన కొంత భూమి కావాలని కోరింది. అందుకు వీరు ఒప్పుకోలేదు. దీనివల్ల తమ భూమి ఎక్కువ మొత్తంలో కోల్పోతామని వారు పంచాయతీ వారి అభ్యర్ధనను తిరస్కరించారు. ఇదేమీ పట్టని పంచాయతీ పెద్దలు ఒకరోజు జేసీబీతో సహా ఇంటికి చేరుకుని రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీన్ని అడ్డుకున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళపై తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పంచాయతీ నాయకుడు అమల్ సర్కార్ తన అనుచరులతో దాడికి తెగబడ్డాడు. అతని అనుచరులు యువతుల కాళ్లను తాళ్లతో కట్టేసి, కొట్టుకుంటూ నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు.
ఈ అమానవీయ ఘటనను వ్యతిరేకించిన అమె సోదరి తన అక్కను కాపాడేందుకు వెళ్లగా.. అమెను కూడా కిందపడేసి ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. నిందితుడు ఆమె మెడలోని బంగారు గొలుసును, మొబైల్ ఫోన్ను లాక్కున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో టీఎంసీ అధిష్టానం నిందితుడు అమల్ సర్కార్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై స్మృతి మాట్లాడుతూ.. ‘దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాను. కానీ ఎప్పుడైతే కింద పడ్డానో ఆ క్షణం వాళ్లు నా కాళ్లు లాగి, తాళ్లతో కట్టేసి 30 అడుగుల వరకు ఈడ్చుకుంటూ పోయారు. వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు. ఐరన్ రాడ్డుతో తలపై బాదేందుకు ప్రయత్నించారు. చంపుతామని బెదిరించారు అని పేర్కొంది.
బీజేపీ నాయకుడు, బలుర్ఘాట్ ఎంపీ సుకాంత మజుందార్ యువతులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. అభివృద్ధి చెందిన నాగరిక సమాజంలో ఇప్పటికీ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదన్నారు. దీనికి కారణమైన పంచాయతీ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా ....ఈ ఘటనపై బాధితురాలు స్మృతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు దాడికి కారణమైన వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more