Woman farmer dies of Heart Attack in Mandadam అమరావతి కోసం పోరాడి ఓఢిన మహిళా రైతు..

Amaravati protest continues for 43rd day woman farmer passes away

Bharati, Mandadam, woman farmer, navaluru, Rangishetty Venkateshwar Rao, Amaravati JAC, Mangalagiri magistrate, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

After a Young farmer from Mangalagiri dies of heart attack yesterday, today a woman farmer, who took part in the ongoing stir by Ryots against the move to shift the Andhra Pradesh capital to Visakhapatnam, died while undergoing treatment in Hospital.

43వ రోజుకు అమరావతి ఆందోళనలు.. పోరాడి ఓడిన మహిళా రైతు..

Posted: 01/29/2020 11:04 AM IST
Amaravati protest continues for 43rd day woman farmer passes away

రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ బిల్లును తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న అమరావతి ప్రాంత రైతుల అందోళనకు ఇవాళ్టితో 43వ రోజుకు చేరకున్నాయి. అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లు  సెలక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి నిర్ణయం తీసుకోవడంతో కొంత ఉపశమనం లభించినా.. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు.. తమ అందోళన కార్యక్రమాలు సాగుతూనే వుంటాయని ఆ ప్రాంత రైతులు పేర్కోన్నారు.

మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలతో పాటు స్థానిక విద్యార్థి, యువజన జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం ... అమరావతిని సాధిస్తాం’ అంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహిస్తున్న రైతుల ఆందోళనలు ఉదయం నుంచే కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతాల్లోని 29 గ్రామాల్లో ఈ ఆందోళనలను కొనసాగుతున్నాయి. మరోవైపు రాజధానిని తరలిస్తున్నారన్న మనస్తాపంతో తీవ్ర అందోళనకు గురవుతున్న రైతన్నలు ప్రాణాలను కొల్పుతున్నారు.

నిన్న మంగళగిరి మండలం నవులూరులో రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు.. తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. కాగా, ఇవాళ మరో మహిళా రైతు మరణించడంతో అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో విషాదం నెలకొంది. రాజధాని అంశంపై ఆవేదనతో భారతి (55) అనే మహిళా రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె మృతి చెందారు. రాజధాని కోసం ఆమె కుటుంబం తమకున్న అర ఎకరం భూమిని ఇచ్చింది. రాజధాని ఉద్యమంలో ఆమె చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఒత్తిడిని జయించలేక చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణంతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles