దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషిగా తేలిన ముఖేష్ కుమార్ సింగ్.. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ న్యాయస్థాన దర్మాసనం కోట్టివేసింది. క్షమాబిక్ష పిటీషన్ ను సవాల్ చేస్తూ.. ముకేష్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కోన్న విషయాలపై స్పందిస్తూ.. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాతే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరించారని స్పష్టం చేసింది. రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటీషన్ తో పాటు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులన్నింటినీ కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి అందజేసిందని తెలిపింది.
దోషి ముఖేష్ సింగ్ వాదనల్లో ఎలాంటి మెరిట్ లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం క్షమాబిక్షను వేగంగా తిరస్కరించడం అంటే.. పరిశీలించకుండా తిప్పిపంపడం కాదని.. అనాలోచిత నిర్ణయం అని భావించడం అంతకన్నా తప్పని సూచించింది. అయితే జైల్లో దోషి ఎదుర్కోన్న బాధను న్యాయస్థానం అర్థం చేసుకుందని, అయినంతమాత్రన దానిని ఆదారంగా చేసుకుని క్షమాబిక్ష తిరస్కరణను సవాల్ చేయడం సముచిత చర్యకాదని పేర్కోంది. జైల్లో వేధించారన్న కారణంగా దోషి దాఖలు చేసిన రాష్ట్రపతి క్షమాబిక్ష తిరస్కరణ నిర్ణయాన్ని సమీక్షించలేమిన పేర్కోంది.
నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒక్కరైన ముఖేష్ కుమార్ సింగ్ రాష్ట్రపతి క్షమాబిక్ష పిటీషన్క తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై మంగళవారం అత్యున్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది. ఈ పిటిషన్పై జస్టిస్ ఆర్. భానుమతి నేతృత్వంలోని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నాలతో కూడాని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం సుదీర్ఘ విచారణ జరిపింది. కాగా ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువరించిన న్యాయస్థానం దోషి ముఖేష్ సింగ్ పిటీషన్ ను కొట్టివేస్తున్నట్లు పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more