రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకోవడంతో కొంత ఉపశమనం లభించినా.. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు.. సాధించేవరకు తాము అందోళన కార్యక్రమాలను విరమించబోమని అమరావతి ప్రాంత రైతులు నిరనన కార్యక్రమాలు కొనసాగిస్తూనే వున్నారు. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు అమరావతి సీఆర్డీఏ ప్రాంతంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ కోనసాగుతున్నాయి.
మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలతో పాటు స్థానిక విద్యార్థి, యువజన జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం ... అమరావతిని సాధిస్తాం’ అంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాజధానిని తరలిస్తున్నారన్న మనస్తాపంతో తీవ్ర అందోళనకు గురవుతున్న రైతన్నలు ప్రాణాలను కొల్పుతున్నారు. తాజాగా మంగళగిరి మండలం నవులూరులో రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అందోళనల్లో కొనసాగిన ఆయన తవ్ర మనస్తాపానికి గురై అసువులు బాసారు. రాజధానిపై అందోళనతో ఇవాళ తెల్లవారు జామున ఆయన మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. మృతుడి కుటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించారు. మరోవైపు రాజధాని పరిధిలోని మందడం, తుళ్లూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
#WATCH Amaravati: Protests continue against Andhra Pradesh Govt's decision of decentralization(three capitals). People in Rayapudi protested in Krishna river against the Govt decision@AndhraPradeshCM pic.twitter.com/c1KD7Qe7RW
— News24 India (@news24tvchannel) January 28, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more