ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆయ ప్రాంత రైతులు చేస్తున్న అందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో క్యాబినెట్ భేటి, ప్రత్యేక అసెంబ్లీకి ఏర్పాటు చేసిన క్రమంలో అమరావతి గ్రామాల ప్రజలు తమ గళాన్ని వినిపించేందుకు గట్టిగా ప్రయత్నం చేశారు. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ నేతలతో పాటు టీడీపీ పార్టీ కూడా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.
దీంతో భారీ స్థాయిలో ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా నేతలను గృహనిర్భంధంలోకి తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంచణీయ ఘటన చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గ్రామాల నుంచి ప్రజలు కూడా బయటకు రాకుండా కంచెలను ఏర్పాటు చేసినా.. పోలీసు ఆంక్షలు, కాకీ కవాతులు, ముళ్ల కంచెలను లెక్క చేయకుండా సచివాలయం రెండో గేటు సమీపానికి రైతులు దూసుకొచ్చారు.
మందడం నుంచి పొలాల మీదుగా చిన్నా పెద్దా అక్కడికి తరలివచ్చారు. దారివెంబడి ఉన్న ముళ్ల చెట్లను దాటుకొని భారీగా తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. జాతీయ జెండాను చేతబట్టిన రైతులు, మహిళలు పోలీసుల చర్యను నిరసిస్తూ పంట కాల్వలో దిగి నిరసన చేపట్టారు. ప్రాణ సమానమైన భూములను రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేస్తే.. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పట్ల పోలీసులు అనుచిత వైఖరి
అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి భారీగా రైతులు తరలివస్తున్నారు. అసెంబ్లీ కాంప్లెక్స్ను నలువైపులా రైతులు చుట్టుముట్టారు. దీంతో రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు లాఠీఛార్జికి దిగారు. మరోవైపు పోలీసుల ఆంక్షలు తెంచుకుని రైతులు నలువైపులా సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం మెయిన్ గేట్ దగ్గరకు రాజధాని రైతులు చేరుకున్నారు. రైతులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుంటున్నారు.
దీంతో రైతలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. సచివాలయం ఎదుట కాలువలోకి దిగి రైతులు, మహిళల నిరసనకు దిగారు. మీడియా దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. రైతులు, నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లో రైతులపై లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్పై కూడా పోలీసులు దాడికి దిగారు. పోలీసులు గల్లా చొక్కాను చించారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు రైతులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more