ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి.కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులతో ఆయనకు సంబందాలు వున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారు జామునే చేరుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు జరిపారు. సుమారు ఐదు గంటలకుపైగా సోదాలు చేసిన పోలీసులు కాశీం ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశారు.
ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం గజ్వేల్ పోలిస్ స్టేషన్ కు ఆయనను తరలించనున్నట్లు సమాచారం. కాశీం అరెస్ట్పై భార్య స్నేహలత స్పందించారు. ఐదేళ్ల క్రితం కేసులో గజ్వేల్ పోలీసులు తనిఖీలు చేశారని.. 2016లో అక్రమంగా బనాయించిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తన గళం విప్పినందుకే ప్రభుత్వం కక్షగట్టి.. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తోందని మండిపడ్డారు.
ఇవాళ తెల్లవారు జామున పోలీసులు కనీసం తలుపులు తెరవాలని కూడా సమాచారం అందించకుండా.. తలుపులు పగులగొట్టి లోపలికి వచ్చారని అమె అరోపించారు. తన ఇంట్లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్, పుస్తకాలను తీసుకెళ్లిన పోలీసులు తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తాను అన్నారు. కాగా ప్రోఫెసర్ క్వార్టర్ వద్దకు చేరుకుంటున్న ఓయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఖాసీం ఇంట్లో పోలీసులు ఈ తనిఖీలు చేశారు.
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ ఖాసీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే తనిఖీలు చేస్తున్నారట. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఖాసీం ఏ-2గా ఉన్నారట. అప్పుడు ఆయన కారులో విప్లవ సాహిత్యం దొరికిందట. ఈ కేసులో మరోసారి సెర్చ్ వారెంట్లతో సోదాలు చేస్తున్నారట. ప్రొఫెసర్ ఖాసీం ఇటీవలే విప్లవం సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more