నిర్భయ దోషులను క్షమించమని కోరిన సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరాజైసింగ్ పై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తెపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన దోషులను క్షమించమని కోరేందుకు లాయర్ ఇందిరాజైసింగ్ ఎవరని, ఆమెకు ఎంత ధైర్యం అని నిర్భయ తల్లి ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరిశిక్షకు తాను వ్యతిరేకమని, నిర్భయ దోషులను ఆమె తల్లి ఆశాదేవి క్షమించాలని ఆమె కోరారు. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.
ఇందిర విజ్ఞప్తిపై స్పందించిన ఆశాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె అలాంటి సలహా ఎలా ఇవ్వగలరని మండిపడ్డారు. అసలు తనకు సలహా ఇవ్వడానికి ఆమె ఎవరని ప్రశ్నించారు. ఉరి తీయాలని దేశమంతా కోరుకుంటుంటే, క్షమించమనేంత ధైర్యం ఆమె ఎలా చేయగలిగారని మండిపడ్డారు. గతంలో ఇందిరను చాలాసార్లు కలిసినా తన క్షేమ సమాచారాల గురించి ఎప్పుడూ అడగలేదని, ఇప్పుడు మాత్రం దోషుల తరపున వకాల్తా పుచ్చుకుని క్షమించమని కోరుతున్నారని ఆశాదేవి ఫైరయ్యారు.
నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో.. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్.. దోషులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్భయ తల్లి ఆశాదేవికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆమె భర్త, మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో దోషి అయిన నళినిని ఆమె క్షమించారని ఈ సందర్భంగా ఇందిర గుర్తు చేశారు. ఈ విషయంలో ఆశాదేవి పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్న ఆశాదేవి ఆవేదనలో అర్థం ఉందని, ఈ విషయంలో ఆమెకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.
అయితే, తాను ఉరిశిక్షలకు మాత్రం తాము పూర్తి వ్యతిరేకమని చెప్పిన ఆయన నిర్భయ తల్లి ఆశాదేవిని క్షమాబిక్ష పెట్టాలని కోరారు. దీంతో ఇందిరా జైస్వాల్ వినతిపై తీవ్రంగా స్పందించారు ఆశాదేవి. ఏడేళ్లుగా తమ కూతురుకు జరిగిన అన్యాయం విషయంలో తాను పోరాటం చేస్తుండగా, ఏ ఒక్కరోజు బాధితులమైన తమను పట్టించుకోని అమె.. ఇవాళ నేరగాళ్లకు మద్దతుగా గళం వినిపించడం.. నేరాన్ని ప్రోత్సహించడమేనని అన్నారు. తన కుమార్తె మరణానికి న్యాయం కావాలని ఓ పక్క పోరాడుతుంటే.. మరోవైపు ఇలాంటి న్యాయవాదులు దోషులకు అండగా నిలిచి వారికి సానుభూతిని మూటగట్టే చర్యలను చేపడుతున్నారని అమె దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more