ఎంత చిన్న రైల్వే స్టేషన్ అయినా రోజు మొత్తం మీద ఒక్క ప్యాసింజర్ రైలైనా నడవాల్సిందే. సదరు స్టేషన్ లో అగి ప్రయాణికులను ఎక్కించుకుని వారి గమ్యస్థానాలకు చేర్చాల్సిందే. రైల్వే శాఖలో అత్యంత చిన్న రైల్వే స్టేషన్ తీసుకుని దాని నిర్వహణకు అయ్యే ఖర్చులను చూసుకున్నా.. ఏకంగా నెలకు మూడున్నర లక్షల రూపాయలు కేవలం జీతబెత్యాలకే సరిపోతుందని అంచనా. అయితే ఏ రైల్వేస్టేషన్ ను కొత్తగా ప్రారంభించినా.. ఆ స్టేషన్ నిర్వహణ ఖర్చులతో పాటు కాస్తో, కూస్తో లాభాన్ని కలుపుకుని ఏటా రూపాయలు కోటి రమారమి లేనిదే గిట్టుబాటు కాదు.
అయితే సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి, అందులోనూ డెబై ఏళ్లు స్వాతంత్ర భారతావనిలో ఏ పాలకులు ఇప్పటివరకు చేయని పనులను చక్కబెడుతూ.. తనదైన ముద్రను అన్నింటా వేస్తూ ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన రైల్వే స్టేషన్ అంటే ఇంకెలా వుండాలి. అలా ప్రారంబిస్తే చాలు.. ఇలా వడపోయలేనన్ని లాభాలు వచ్చితీరాల్సిందే. సరిగ్గా ఏడాది క్రితం ప్రధాని నరేంద్రమోడీ చేతులు మీదుగా ప్రారంభానికి నోచుకున్న రైల్వేస్టేషన్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. నెలకు రూ.600లను ఆర్జించేందుకు ఏకంగా మూడున్నర లక్షలను వెచ్చిస్తున్నారంటే ఎంతటి ఘనత.
ప్రధాని మోడీ చేతులు మీదుగా ప్రారంభానికి నోచుకున్న రైల్వే స్టేషన్ లో రోజువారీగా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కేవలం ఇద్దరు. ఇద్దరి కోసమే ఒక రైల్వే స్టేషన్ నడుస్తోందంటే అశ్చర్యపోవాల్సిందే. ఇక సదరు రైల్వే స్టేషన్ కు ప్రతి రోజు వచ్చే ఆదాయం కేవలం రూ.20 అంటే విస్మయం కలగకమానదు. ఇద్దరంటే ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఆ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారట. ఇంతకీ ఆ స్టేషన్ ఉన్నది ఒడిశాలో. బొలంగిర్ జిల్లాలోని బిచ్చుపాలి రైల్వే స్టేషన్ దే ఈ ఘనత.
ఇటీవల ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ చట్టం ద్వారా ఈ స్టేషన్ గురించిన సమాచారం రాబట్టారు. బిచ్చుపాలి రైల్వే స్టేషన్ నుంచి రోజు మొత్తం మీద ప్రయాణించేది ఇద్దరేనని, వారి ద్వారా రూ.20 ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు. బొలంగిర్ నుంచి బిచ్చుపాలికి రైల్వే లైన్ వేయడానికి, ఇక్కడ స్టేషన్ నిర్మించడానికి రూ.115 కోట్లు ఖర్చయింది. కానీ స్టేషన్ నిర్వహణకు రోజుకు ఎంత ఖర్చవుతుందో మాత్రం అధికారులు చెప్పలేదు. ఇక ఈ రైల్వేస్టేషన్ ను సోనిపూర్ రైల్వే స్టేషన్ తో అనుసంధానం చేసేవరకు పరిస్థితి ఇలానే వుంటుందని.. అయితే మరో ఏడాదిలో అనుసంధాన పనులు పూర్తవుతాయని ఈస్ట్ కోస్ట్ సీపీఆర్వో మిశ్రా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more