ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 30 రోజుకు చేరుకున్నాయి. అమరావతి పరిధిలోని 29గ్రామాల్లో ఎక్కడా చూసినా ఆయా గ్రామాల ప్రజలు నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అమరావతి ముద్దు, మూడు రాజధానులు వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. పండుగ శోభతో కళకళలాడాల్సిన పల్లెలు బోసిపోయి కనిపిస్తున్నాయి. పండుగ వాతావరణం తమ భావితరాలకు అందించడానికే తాము పండుగలకు కూడా దూరంగా వుంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని రైతులు పేర్కోన్నారు.
రాజధాని పరిధిలోని 29 గ్రామాల పరిధిలో ఎక్కడ చూసినా ఇదే చిత్రం కనిపిస్తోంది. దీనికి తోడు పండుగులకు ఇంటికొచ్చిన బంధువులు కూడా వారితో కలసి టెంట్లలో కూర్చోని నిరసన తెలియజేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం సహా రాజధాని గ్రామాలైన అమరావతిలో నిరసనలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల మహా ధర్నా, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
నెల రోజులుగా తాము చేస్తున్న దీక్షలకు మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థుల నుంచి సంఘీభావం లభించిందని, వారు కూడా తమకు మద్దతుగా నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారని రైతులు తెలిపారు. సినీ ప్రముఖుల నుంచి కూడా తమకు సంఘీభావం లభించిందని పలువురు సినీనటులు కూడా తమకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. కాగా, ముఫై రోజులు గడుస్తున్నా తమ దీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చలించక పోవడం దుర్మార్గం అని రైతులు మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయం అర్థ రహితమని, తెలివి తక్కువ ప్రతిపాదనలను వెనక్కి తీసుకొవాలని డిమాండ్ చేశారు. 24 గంటల పాటు చేపట్టిన రైతుల నిరహార దీక్షను గురువారం ఉదయం 10 గంటలకు ఐకాస ప్రతినిధులు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి తన సంఘీభావాన్ని తెలియజేయనున్నారు.
రాజధాని రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇందుకు ఏర్పాట్లు చేశారు. హైపవర్ కమిటీకి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపవచ్చని మంత్రులు సూచించారు. ఇప్పటి వరకూ 3100 మంది రైతులు తమ అభిప్రాయాలను తెలిపినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 17 వరకు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. భూములు ఇచ్చిన రైతులు తమ విజ్ఞప్తులు ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్ పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more