అమరావతి ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను ఈ ప్రభుత్వం కావాలనే రెచ్చగొడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, పోలీసు బలంతో రైతుల ఉద్యమాన్ని అణచి వేయాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని అరోపించారు. ఇటువంటి చర్యలతో ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నిర్బంధం, అరెస్ట్ లతో ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే, ఉద్యమం ఉద్ధృతం అవుతుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
ఉద్యమ అణచివేతలో భాగంగానే నిన్న చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బస్సుయాత్రలకు అనుమతినిచ్చిన పోలీసులు.. యాత్రను చేపట్టేందుకు వెళ్తున్న నాయకులను మాత్రం అడ్డుకుంటారా.? అని ఎద్దేవా చేశారు. అమరావతి రైతులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలను ఉద్రిక్తంగా మార్చి.. ఆ తరువాత హింసాత్మకంగా మార్చేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన అందోళన వ్యక్తం చేశారు.
అదే జరిగితే పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో జరిగినట్లుగానే అమరావతి రైతుల ఉద్యమం మారుతుందని ఆయన హెచ్చరించారు. అయితే అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరయ్యేందుకు పాదయాత్రగా తరలివస్తున్న విపక్ష పార్టీల నేతలను వైసీపీ ప్రభుత్వం పోలీసులు బలగాలతో ఎక్కడికక్కడ అడ్డుకోవడాన్ని ఆయన తప్పబట్టారు. చంద్రబాబు పాదయాత్రను పోలీసులు విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద నిన్న అడ్డుకోవడంతో ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండవల్లిలోని తన నివాసానికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మూడున్నర గంటల పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more