మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదయ్యింది. నిధుల మళ్లింపు విషయంలో రాయపాటిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్టాయ్ కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.16 కోట్లు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే రాయిపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే.
15 బ్యాంకుల నుంచి రూ.8832 కోట్లు కంపెనీ రుణం తీసుకున్నది. రూ.3822 కోట్లు దారి మళ్లించినట్టు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. సింగపూర్, మలేషియా, రష్యాలకు నిధులు మళ్లించినట్టు అభియోగాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు తన ఇంటికి సోదాల కోసం వచ్చినప్పుడు తాను ఇంట్లో లేనని స్పష్టం చేసిన ఆయన, తనిఖీల తరువాత వారికి ఏమీ లభించలేదని అన్నారు. అదే విషయాన్ని చెబుతూ, వారు తన ఇంటి నుంచి వెళ్లిపోయారని మీడియాకు చెప్పారు.
అంతేకాదు అసలు సీబీఐ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని రాయపాటి అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వ్యవహారాలన్నీ సంస్థ సీఈవోనే చూసుకుంటున్నారని, తనకుగానీ, తన కుటుంబీకులకు గానీ ప్రమేయం లేదని అన్నారు. కాగా, సీబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించిన రెండు రోజుల వ్యవధిలోనే ఆయనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫెమా చట్టం కింద కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more