Pawan Kalyan penumaka video now goes viral నెట్టింట్లో పవన్ కల్యాణ్ వీడియో హల్ చల్..

Jana sena chief pawan kalyan penumaka video now goes viral

Janasena, Pawan Kalyan, Mangalagiri, Amaravati, shifting of capital, 29 Villages, Three Capitals, YSRCP Government, vishakapatnam, Rayalaseema, division between regions, HighCourt, Kurnool, andhra pradesh, politics

Jana Sena chief Pawan Kalyan was blocked by police while he was on his way to Madadam village from Krishnayapalem. The police have directed him to move on to Tulluru for which the Jana Sena cadre and farmers fired at police.

ITEMVIDEOS: ప్రభుత్వం మారితే.. నెట్టింట్లో పవన్ కల్యాణ్ వీడియో వైరల్

Posted: 01/02/2020 06:06 PM IST
Jana sena chief pawan kalyan penumaka video now goes viral

మూడు రాజధానుల ప్రతిపాదనపైనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకువెళ్లేందుకు నిర్ణయించుకున్న తరుణంలో.. అమరావతి గ్రామాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడి రైతులకు తన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని గ్రామాల రైతులు తమ పోరాటాన్ని అపవద్దని చెప్పారు. ఎవరు చెప్పినా పోరాటాన్ని ఆపకండీ.. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా హామి లభిస్తేనే ఉద్యమాన్ని విరమించండని ఆయా గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు.

గతంలోనే ఆయన ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయితే పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీసారు. అయితే దీనిపై అప్పటి ప్రభుత్వం స్పందిచలేదు. కాగా, రాజధాని నిర్మాణం తమ కోసం కాదని, రాష్ట్రం కోసమని చెప్పిన నేతలు.. ఏ ప్రభుత్వమైనా రాజధానిని ఇక్కడే నిర్మించాల్సిందేనని అన్నారు. తాజాగా అమరావతి పర్యటన తర్వాత.. టీడీపీ హయాంలో పెనుమాక గ్రామంలోని  ఓ సభలో తాను చేసిన ప్రసంగాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. దానిని నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడదే పరిస్థితిని అమరావతి ప్రజలు ఎదుర్కోంటున్న క్రమంలో నెట్టింట్లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

2015, ఆగస్టు 23న పెనుమాకలో తన ప్రసంగ వీడియోను పోస్ట్ చేశారు. ‘భూ సమీకరణ ఎంత పకడ్బందీగా ఉండాలంటే.. అనేక వేల మంది రైతులు తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వాళ్ల, వాళ్ల పిల్లల, తరాల భవిష్యత్ ను తీసుకొచ్చి ప్రభుత్వం చేతిలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాకపోతే.. అలాంటి పరిస్థితుల్లో రైతులకు గ్యారంటీ ఏంటీ?’ అంటూ పవన్ తన ప్రసంగంలో ప్రశ్నించడం ఈ వీడియోలో ఉంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు కనుక లేకపోతే ఎంత హాని కలుగుతుంది? దానిపై టీడీపీ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది? అంటూ పవన్ ప్రసంగించడం గమనార్హం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles