Amaravati farmers state protest for 16th day అమరావతి రైతుల అందోళనలు.. సెక్రటేయిట్ రోడ్డు దిగ్భంధం

Mandadam farmers protest demanding amaravati as single capital

YS Jagan, Amaravati, Amaravati Bandh, !44 Section, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Andhra Pradesh, Politics

The protests by farmers in the Amaravati region demanding the continuation of Amaravati as the capital has reached 16th day. As part of the agitation, a tent was laid on the road at Mandadam. The farmers blocked the road leading to the secretariat in Velagapudi.

అమరావతి: సెక్రటేరియట్ రోడ్డుపై రైతుల అందోళనలు..

Posted: 01/02/2020 03:45 PM IST
Mandadam farmers protest demanding amaravati as single capital

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్ క్యాపిటల్ గా అవరావతినే కోనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు గత పదహారు రోజులుగా నిరసనలు అందోళనలు చేపడుతున్నారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను ఇప్పటికైనా సీఎం జగన్, ఏపీ ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్ కోసమంటూ భూములు తీసుకుందని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు రాజధానులంటూ మరో ప్రతిపాదనను తీసుకువచ్చిందని.. ఇలా ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా తమను అందోళనకు గురిచేస్తే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ఆందోళనలో భాగంగా 16వ రోజున రాజధాని రైతులు మందడంలో రహదారిపై టెంట్‌ వేసి మహాధర్నా చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లే రహదారిని రైతులు దిగ్బంధించారు. జగన్‌ ఆలోచనలకు అనుగుణంగానే జీఎన్ రావు నివేదిక ఇచ్చారని రైతులు ఆరోపించారు. ముఖ్యమంత్రి ముందుగా అసెంబ్లీలో సంకేతాలు ఇస్తే.. దానినే కమిటీ ఎలా ప్రతిపాదనలో పొందుపరుస్తుందని వారు ప్రశ్నించారు. బూటకపు కమిటీలతో కాలయాపన ఎందుకని ప్రశ్నించారు. అమరావతి గురించి ఏం తెలుసని మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రైతులు నిలదీశారు.

ముఖ్యమంత్రి జగన్‌ సచివాలయానికి వెళ్లాలంటే 7వేల మందిపోలీసులు పహారా కాస్తున్నారని ఇలాంటి పరిస్థితులను ఆయన తన చేజేతులా ఉత్పన్నం చేసుకున్నారని.. ఓట్లు వేసిన మా నుంచే నిరసలు చేపట్టేలా చేయించుకుంటున్నారని వారు విమర్శించారు. తప్పు చేస్తున్నారు కాబట్టే అంత భయపడుతున్నారు అని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ఎవరి కోసమని రైతులు ప్రశ్నించారు. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles