ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్ క్యాపిటల్ గా అవరావతినే కోనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు గత పదహారు రోజులుగా నిరసనలు అందోళనలు చేపడుతున్నారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను ఇప్పటికైనా సీఎం జగన్, ఏపీ ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్ కోసమంటూ భూములు తీసుకుందని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు రాజధానులంటూ మరో ప్రతిపాదనను తీసుకువచ్చిందని.. ఇలా ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా తమను అందోళనకు గురిచేస్తే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఆందోళనలో భాగంగా 16వ రోజున రాజధాని రైతులు మందడంలో రహదారిపై టెంట్ వేసి మహాధర్నా చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లే రహదారిని రైతులు దిగ్బంధించారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగానే జీఎన్ రావు నివేదిక ఇచ్చారని రైతులు ఆరోపించారు. ముఖ్యమంత్రి ముందుగా అసెంబ్లీలో సంకేతాలు ఇస్తే.. దానినే కమిటీ ఎలా ప్రతిపాదనలో పొందుపరుస్తుందని వారు ప్రశ్నించారు. బూటకపు కమిటీలతో కాలయాపన ఎందుకని ప్రశ్నించారు. అమరావతి గురించి ఏం తెలుసని మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రైతులు నిలదీశారు.
ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్లాలంటే 7వేల మందిపోలీసులు పహారా కాస్తున్నారని ఇలాంటి పరిస్థితులను ఆయన తన చేజేతులా ఉత్పన్నం చేసుకున్నారని.. ఓట్లు వేసిన మా నుంచే నిరసలు చేపట్టేలా చేయించుకుంటున్నారని వారు విమర్శించారు. తప్పు చేస్తున్నారు కాబట్టే అంత భయపడుతున్నారు అని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ఎవరి కోసమని రైతులు ప్రశ్నించారు. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more