దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక హత్యాచార కేసులోని దోషులు తమ చావును తప్పించుకునేందుకు వినియోగించిన చివరాఖరి అస్త్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడంతో.. ఇక వారికి ఉరిశిక్ష విధించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ కేసులోని ముగ్గురు దోషులు తమకు విధించబడిన ఉరిశిక్ష నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతూ క్షమాబిక్ష పిటీషన్ వేశారు. దేశ సర్వో్న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన పత్రాలను ధాఖలు చేసిన నేపథ్యంలో న్యాయస్థానం నుంచి దోషుల పిటీషన్లు రాష్ట్రపతి భవన్ కు చేరాయి.
అయితే ఈ క్షమాబిక్ష పిటీషన్లను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారని కార్యాలయ వర్గాల నుంచి సమాచారం. ఇక అత్యాచార కేసుల్లో దోషులుగా తేలిని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాబిక్ష ఇవ్వడం కుదరదని.. ఈ కేసుల్లోని దోషులకు న్యాయస్థానాలు విధించే శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన తెలంగాణలో ప్రియాంకా రెడ్డి హత్యాచార ఉదంతం నేపథ్యంలో ఓ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తీహార్ జైలు అధికారులు ఈ కేసులో దోషులైన నలుగురికి ఒకేసారి ఉరిశిక్షను విధించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 7న వీరిపై డెత్ వారెంట్ తీర్పు వెలువడనున్నట్టు తెలుస్తుండగా, నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే, ప్రస్తుతం తీహార్ జైలులో ఒకే ఉరికంబం ఉండడంతో, మరో మూడింటిని నిర్మిస్తున్నారు. పీడబ్ల్యూడీ విభాగం సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమైంది. నూతనంగా మూడు ఉరికంబాలను, మూడు సొరంగాల నిర్మాణాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. కాగా, తీహార్ జైల్లో ఉరి తీసే ప్రదేశంలో మొత్తం 16 డెత్ సెల్స్ ఉండగా, రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించగానే, నలుగురినీ నాలుగు వేర్వేరు గదులకు జైలు అధికారులు తరలించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more