వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తెలుగు చిత్రరంగంలో అనేక వివాదాలకు కారణమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన రేంజ్ నుంచి ఆయన గ్రాఫ్ క్రమంగా తగ్గిపోతున్న సమయంలో ఆయన రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని చిత్రాలను రూపొందించారు. తన సినిమాలకు మీడియాతో ప్రచారం ఎలా కల్పించుకోవాలో ఆర్జీవికి తెలుసునని కూడా పలువురు వ్యాఖ్యానించారంటే ఆయన రేంజ్ ఇట్టే అర్థమైపోతుంది. ఆయనకే కాదు ఆయన పేరుకు కూడా ఆ రేంజ్ వుందని కంట్రీ క్లబ్ న్యూఇయర్ రోజున నిరూపించింది.
తమ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆర్జీవిని తీసుకువస్తామని చెప్పడంతో.. ఆర్జీవిని చూడాలని.. ఆశతో కొందరు యువత కంట్రీ క్లబ్ ఈవెంట్ కు హాజరయ్యారు. కానీ వాస్తవానికి అక్కడికి ఆర్జీవి రాలేదు. అసలు న్యూఇయర్ అంటే తనకు మా పెద్దగా ప్రత్యేకతేమీ లేదని, ఇది ప్రతీరోజు మాదిరిగానే వుంటుందని ఆర్జీవి చెప్పిన మాటలను ఒంటపట్టించుకోని యువత ఆయన కోసం వేచిచూశారు. వారిలో ఒకరు టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ తనయుడు కాంత్రి కుమార్. ఇచ్చిన మాటను తప్పారంటూ ఈవెంట్ నిర్వాహకులతో క్రాంతి కుమార్ ఘర్షణకు దిగారు. దీంతో ఆయన కారును అడ్డుకున్న నిర్వాహకులు, తాళాలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.
దీంతో తన కారు కనిపించడం లేదంటూ కంట్రీక్లబ్ వద్ద విధుల్లో ఉన్న ఎస్సై విజయ్ భాస్కర్ రెడ్డికి క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇందుకు అంగీకరించని క్రాంతికుమార్ ఎస్సైతో వాదులాటకు దిగడంతో ఆయనను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలిసిన నట్టి కుమార్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తం 13 మందితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
తన కుమారుడ్ని పోలీసులు అదుపులోకి ఎందుకు తీసుకున్నారంటూ వాదులాటకు దిగారు. అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న సిబ్బందిని నట్టి కుమార్ కుటుంబ సభ్యులు చేత్తో నెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు..విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారి విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై హైదరాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అంతేగా మరి ఎవరి అనువుగాని చోట అధికులం అన్నరాదన్నది ఇప్పటికైనా కాంత్రికుమార్ కు బోధపడిందోలేదో మరి. ఇక ఆర్జీవి పేరుకున్న కాంట్రావర్సీ పవర్ ఇదని కూడా పలు రూమర్లు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more