దేశ రాజధాని న్యూఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని ఓ పరిశ్రమలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి మంటలను అర్పుతున్న సమయంలోనే ఓ పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో అగ్నిమాపక సహాయక బృందాలు పలువురు పరిశ్రమ శిధిలాల్లో చిక్కుకున్నారని సమాచారం. వీరిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహాయక బృందాలు, పోలీసులు రంగంలోకి దిగారు.
ఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని పీరాగర్లీలోని ఓ ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలోనే భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడ శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు.
ఈ ఫ్యాక్టరీలో బ్యాటరీలు లీకైన కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మంటలను 36 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ భవనం కుప్పకూలింది. కాగా, ఈ పరిశ్రమ భవనం నిర్మాణం సహా అనేక అక్రమాలకు పాల్పడిందని అగ్నిప్రమాదం నేపథ్యంలో వెల్లడైన తొలి దర్యాప్తులో వెల్లడైందని అగ్నిమాపక సేవల డైరెక్టర్ అటుల్ గర్జ్ తెలిపారు. పరిశ్రమ నిర్మాణంలో అనేక నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్టు తెలుస్తోందని అన్నారు.
పరిశ్రమలో వున్న అత్యంత సున్నితమైన వస్తువులకు గాను తగిన సంఖ్యలో ఫైర్ ఎస్టిన్ గ్విషర్స్ ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇక పరిశ్రమ నిర్మాణంలోనే నిబంధనలకు నీళ్లు వదిలారని, తగిన సంఖ్యలో బయటకు వెళ్లేందుకు మార్గాలు లేవని, చెప్పుకోచ్చారు. ఈ పరిశ్రమ నిర్మాణంలో తగిన వెంటిలేషన్ కూడా లేదని, అందుచేతే ప్రమాదం తీవ్రత పెరిగిందని భవనం కుప్పకూలడానికి కూడా కారణమయ్యిందని అన్నారు. ఇక పరిశ్రమ నిర్మాణానికి సంబంధిత శాఖ అధికారుల నుంచి ఎన్ఓసీలు కూడా తీసుకున్నారా.? లేదా అన్న అంశాలను కూడా పరిశీలిస్తామని ఆయన అన్నారు.
ఈ అగ్నిప్రమాదంలో మొత్తంగా 14 మంది గాయపడ్డారని అందులో 13 మంది అగ్నిమాపక దళానికి చెందిన వారేనని అటుల్ గార్డ్ తెలిపారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన జరిగిన ఓ ఘోర అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి చెందారు. ఆ తర్వాత కూడ మరో ప్రాంతంలో కూడ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ రెండు ఘటనల తర్వాత చోటుచేసుకొన్న అగ్నిప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్షిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more