మాజీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఇంటితో పాటు ఆయన సంస్థలపై ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఉదయం ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు ప్రారంభించిన సీబిఐ అధికారులు.. గుంటూరు, హైదరాబాద్ ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు నగరాల్లోని రాయపాటి ఇల్లు, కార్యాలయాలతో పాటు ట్రాన్స్ ట్రాయ్ సంస్థలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రాయపాటికి వాటాలు ఉన్న ట్రాన్స్ ట్రాయ్ కి గతంలో పోలవరం కాంట్రాక్టు దక్కిందన్న సంగతి విదితమే. అయితే, కొన్ని సమస్యల కారణంగా, ఇతర కంపెనీలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చి పోలవరం పనులను ట్రాన్స్ ట్రాయ్ కొనసాగించింది. ఇదే సమయంలో బిజినెస్ పేరిట బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో ట్రాన్స్ ట్రాయ్ విఫలమైంది. ఈ విషయమై గతంలోనే సీబీఐ కేసును నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే ఇవాళ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన రాయపాటి సాంబశివరావు, ఐదుసార్లు లోక్ సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి, నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. ఆపై 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కాగా, తమ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో రాయపాటి సంస్థలు విఫలం అయ్యాయని ఇండియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనూ పలు బ్యాంకులు రాయపాటి సంస్థలపై ఫిర్యాదు చేశాయి. ఆపై రామ్ మాధవ్ సహా పలువురు బీజేపీ నేతలు రాయపాటి ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో ఆయన బీజేపీలో చేరుతారన్న వ్యాఖ్యలు వచ్చాయి. కానీ, ఆయన మాత్రం బీజేపీలో చేరలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ దాడులు జరుగుతుండటం చర్చనీయాంశమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more