పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్కు వరుసగా రెండో రోజు చేదు అనుభవం ఎదురైంది. కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్శిటీ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్ను అక్కడి విద్యార్థులు అడ్డుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వీరంతా గవర్నర్ కారును చుట్టుముట్టి నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. సీఏఏకు అనకూలంగా మాట్లాడుతున్న గవర్నర్ చేతుల మీదుగా తాము డిగ్రీలు తీసుకునేది లేదని పట్టుబట్టారు. దీంతో చేసేదేం లేక గవర్నర్ అక్కడి నుంచి వెనుదిరిగారు.
దీనిపై గవర్నర్ ధన్కర్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి వైస్ ఛాన్సలర్ వీటిని నియంత్రించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ తీరును కూడా ఎండగట్టారు. విద్యార్థుల మధ్య చిక్కుకున్న తర్వాత వీసీ గానీ.. యూనివర్శిటీ సిబ్బంది గానీ తనను సంప్రదించలేదని, అయితే మీడియాకు మాత్రం బైట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను బంధిస్తోందని ఆరోపించారు.
గవర్నర్ ధన్కర్కు సోమవారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. స్నాతకోత్సవరం గురించి యూనివర్శిటీ అధికారులతో మాట్లాడేందుకు వచ్చిన గవర్నర్ను విద్యార్థులు అడ్డుకుని నల్లజెండాలు ప్రదర్శించారు. దాదాపు అరగంట తర్వాత గవర్నర్ యూనివర్శిటీ భవనంలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా విద్యార్థులు మరోసారి అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. జాదవ్పూర్ యూనివర్శిటీ ఛాన్సలర్ అయిన గవర్నర్ ధనకర్ను స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఆందోళనల దృష్ట్యా ఆయనకు ఈ కార్యక్రమంలో ప్రసంగించే, డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం రాలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more