హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి బైక్ నెంబర్ ప్లేట్ ను ఫోటోలు తీస్తూ.. అదునాథన రీతిలో వారికి ట్రాఫిక్ చాలానాలు పంపుతున్న క్రమంలో.. బైక్ యజమానులు కూడా వినూత్నంగా అలోచిస్తూ.. అందుకు పైఎత్తులు వేస్తున్నారు. దీంతో పలువురు వాహనదారులు చలానాలను తప్పించుకునేందుకు ట్రాఫిక్ పోలీసులపై కొత్త టెక్నిక్స్ వినియోగిస్తున్నారు. అయితే వాటన్నింటినీ ఉధ్దేశం మాత్రం తమ వాహన నెంబర్ కెమెరాకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడమే. ఇందుకోసం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.
ఈ టెక్నిక్స్ లో భాగంగా నాలుగు నంబర్ల వరస సంఖ్యలో ఒక అంకెను కనపడకుండా చేయడం.. నంబర్ ప్లేటులో అక్షరాలు తొలగించడం, సంఖ్యలను తుడిచివేయడం.. సరిగ్గా రాయకుండా ఉండటం....నంబర్లు సరిగ్గా కనపడకుండా చేయడం. నంబరు ప్లేటు వంచడం... ట్రాఫిక్ పోలీసులను చూసినప్పుడు వాటిని కనపడకుండా చేయడం.. తప్పుడు నంబర్ ప్లేటు పెట్టుకోవడం.. లాంటివి చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీసినా.. వారికి సగం నెంబరు మాత్రమే చిక్కడంతో.. వారు చాలానాలు వేయలేకపోతున్నారు. ఆలస్యంగా వాహనదారులు ఎత్తుగడపై దృష్టిసారించిన పోలీసులు.. ఇలాంటి వారికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
ఇకపై నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలపై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 420(మోసం), సెక్షన్ 465(ఫోర్జరీ) కింద కేసులు నమోదు చేయనున్నారు. తప్పుడు నెంబర్లు పెట్టుకుని తిరుగుతున్న వాహనా దారులను గుర్తించే పనిలోనే కొందరు పోలీసులు నిమగ్నం కానున్నారని సమాచారం. చార్జీషీట్లు విచారణకు వచ్చినప్పుడు.. నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం చేసినా వారందరూ కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 12,314 మంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు వచ్చి, కనపడకుండా తిరిగారని గుర్తించారు. వీరందరీపై సాధారణ చలాన్ తో పాటు సెక్షన్ 420, 465ల కింద కేసులు నమోదు చేశారు. వీరందరీపై కోర్టులో తప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లను పెట్టుకుని తిరుగుతున్నారని నమోదు చేసిన అభియోగాలపై చార్జీషీట్లను దాఖలు చేస్తున్నారు. వీటిలో కోర్టు విచారణలో తప్పు అని నిర్ధారణ అయితే 420 సెక్షన్ కింద 7 ఏళ్లు, 465 కింద 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. కావునా..వాహనదారులు తమ నంబర్ ప్లేటు స్పష్టంగా కనపడేలా ఏర్పాటు చేసుకోవాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more