అది 2012, డిసెంబర్ 16వ తేదీన.. తనను కట్టుకోబోయేవాడితో పాటు ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన పారామెడికల్ వైద్య విద్యార్థినికి ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ఇందుకు కారణమైన ఆరుగురిలో నలుగురికి అదే రోజున ఉరి శిక్షను అమలు చేయాలని ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు భావిస్తున్నారా.? అంటే ఔను అన్నట్లుగానే సంకేతాలు వస్తున్నాయి. ఆరుగురు పైశాచిక మృగాళ్లు నిర్భయపై దాడి చేసి అత్యాచారం చేయడంతో.. జరిగిన దారుణం తెలిసి యావత్తు దేశం ఉలిక్కిపడింది. అయితే సరిగ్గా మానవ మృగాళ్లు దారుణానికి పాల్పడిన రోజునే వారిని ఉరిశిక్షను కూడా అమలు చేయాలని తిహార్ జైలు అధికారులు భావిస్తున్నారని సమాచారం. అదే డిసెంబర్ 16. అంటే సరిగ్గా వచ్చే సోమవారం.
ఈ నెల 16న ఉదయం 5 గంటలకు మొత్తం ఆరుమందిలో నలుగురు దోషులకు ఈ శిక్ష అమలు చేయనున్నారని తెలుస్తోంది. అత్యాచార ఘటనలపై, ఈ దారుణాలకు పాల్పడే నిందితులపై దేశంలో తీవ్ర వ్యతిరేక భావం, హేయభావంతో పాటు ప్రజల్లో అగ్రహజ్వాలలు కూడా రేకెత్తుతున్నాయి. దీంతో నిందితులకు త్వరగా శిక్ష పడాలన్న డిమాండ్ కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఇటీవల శంషాబాద్ కు చెందిన వైద్యురాలు దిశ హత్యాచార ఉదంతం కేసులో నిందితులను ఎన్ కౌంటర్ ద్వారా పోలీసులు వారిని మట్టుబెట్టిన క్రమంలో ఇదే సరైన శిక్ష అంటూ దేశ ప్రజల నుంచి మద్దతు వ్యక్తమైంది.
ఇక అదే సమయంలో నిర్భయ తల్లి ఆశాదేవి తమ బిడ్డ విషయంలో న్యాయం నత్తనడకన సాగుతోందని, న్యాయం కోసం తాను ఎక్కని జైలు అధికారుల మెట్టు లేదు.. దిగన ఠాణాల మెట్లు లేవని చెప్పారు. ఇక ఇదే విషయమై అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా కేంద్రంపై విమర్శలు చేసింది. ప్రస్తుతం దోషులు తిహార్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులుగా తేలిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు జూవైనల్ కోర్టు విధించిన శిక్ష అనుభవించాడు. మరో దోషి రామ్సింగ్ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దోషులకు శిక్ష అమలులో జరిగిన ఆలస్యంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more