తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బస్సుల్లో కనీస ఛార్జీని అధికారులు వెల్లడించారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.10గా నిర్ణయించారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.15 కనీస ఛార్జీలను వసూలు చేయనున్నారు. డీలక్స్ బస్సుల్లో రూ.20, సూపర్ లగ్జరీల్లో రూ.25, రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్ ఏసీ బస్సుల్లో రూ.35లను కనీస చార్జీలుగా నిర్ణయించారు. వెన్నెల ఏసీ స్లీపర్ కనీస ఛార్జీలను రూ.70కి పెంచారు. ఈ మేరకు కొత్త ధరలను టిమ్ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తున్నారు.
స్టూడెంట్ పాసుల విషయంలోనూ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించినట్టు అర్థమవుతోంది. స్టూడెంట్ బస్ పాస్ ధర రూ.130 నుంచి రూ.165కి పెంచారు. సిటీ ఆర్డినరీ బస్ పాస్ చార్జీని రూ.770 నుంచి 950కి పెంచారు. మెట్రో బస్ పాస్ చార్జి రూ.880 నుంచి రూ.1070కి పెంచారు. మెట్రో డీలక్స్ బస్ పాస్ చార్జీని రూ.990 నుంచి రూ.1180కి పెంచారు. పెంచిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలు కింది విధంగా ఉన్నాయి.
గ్రేటర్ పరిధిలో..
* గ్రేటర్ హైదరాబాద్లో రౌండింగ్ ధర రూ.5 యథావిధిగా కొనసాగనుంది. కనీస చార్జీ మాత్రం రూ.10గా నిర్ణయించారు.
* ఆర్డినరీ ప్రస్తుత కనీస ధర రూ.5గా ఉండగా.. రూ.10కి పెంచారు. గరిష్ఠ ధరను రూ.30 నుంచి రూ.35కు పెంచారు.
* మెట్రో ఎక్స్ప్రెస్ కనీస ధర రూ.10 యధావిధిగా కొనసాగింపు. గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.35కు పెంచారు.
* మెట్రో డీలక్స్ కనీస చార్జీ రూ.10 ఉండగా.. దాన్ని రూ.15కు పెంచారు. గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.45కు పెంచారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more