వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసు ఘటనపై లోక్ సభలోనూ చర్చవచ్చింది. స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతించడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ అంశమై మాట్లాడారు. ఇలాంటి ఘటనలు యావత్ దేశానికే అవమానకరంగా వున్నాయిని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత.. తెలంగాణ వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యోదంతంపై చర్చించేందుకు సమయాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనలు దేశంలోని ప్రతీ ఒక్కరిని బాధతో కదిలించాయని పేర్కోన్నారు. ఇక ఇలాంటి నేరాలకు పాల్పడిన నిందితులకు కఠినమైన శిక్షలు విధించక తప్పదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ కేసుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో ఓ మహిళా వైద్యురాలిని అపహరించి.. సామూహిక అత్యాచారం చేసి ఆ తరువాత.. అమెను దహనం చేసిన ఘటన చోటుచేసుకోవడం హేయకరమని అన్నారు. అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడానికి వున్న కారణాల్లో ఒకటి మద్యపాన విక్రయాలని అన్నారు.
ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రాష్ట్రంలో మధ్యం లభిస్తోందని.. రాష్ట్రంలో జరిగే అన్ని అనార్థాలకు ఇదే కారణమవుతోందని అన్నారు. ఇక ఇలాంటి ఘటనలపై చట్టం తనపని తాను చేసుకుపోతోందని అంటే సముచితం కాదని.. సాధ్యమైనంత త్వరగా ఈ కేసులోని నిందితులకు కఠినమైన శిక్షలు పడాలని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి.. అత్యంత వేగంగా కేసును విచారణను పూర్తి చేసి నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ హత్యోదంతంపై లోక్సభలో మాట్లాడుతూ.. ఇవాళ దేశంలోని ప్రతీ ఒక్క యువతి భయపడుతోందని.. ప్రతి తల్లి, ప్రతి చెల్లి కూడా భయపడుతూనే ఉన్నారని ఎంపీ చెప్పారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించడం ఒక్కటే సరైన న్యాయమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. నిర్భయ ఘటన తర్వాత కూడా అత్యాచారాలు ఆగడం లేదని, అత్యాచార దోషులకు కఠినశిక్షలు పడేలా సమర్ధమైన చట్టాలు తేవాలని వ్యాఖ్యానించారు. మహిళ భద్రతపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని రామ్మోహన్ నాయుడు లోక్సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి దిశ హత్యోదంత ఘటనపై మాట్లాడుతూ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాల సహాయం లభిస్తుందని అన్నారు. ఈ కేసు విచారణను అత్యంత వేగంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అని విధాలా సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పారు. ఈ కేసును వేగవంతంగా విచారించేందుకు కూడా కేంద్రం రాష్ట్రప్రభుత్వం అడిగే అన్ని వినతులను అందిస్తామని చెప్పారు. ఇక ఇదే అంశంపై రాజ్యసభ సభ్యురాలు సోనాల్ మాన్ సింగ్ స్పందిస్తూ.. తాను ఇలాంటి వార్తలు వినేందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.
యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసే ఇలాంటి ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని అయినా మహిళా రక్షణ చర్యలు ఏక్కడా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. దేశంలోని నలు దిక్కులా ఇలాంటి ఘటనలు సంభివిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయని.. ఇలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు, పోలీసులు ఎందుకు, సివిల్ సోసైటీ సానుభూతి మానవత్వం ఏమయ్యాయని అమె ప్రశ్నించారు. ప్రతీసారి క్యాండిల్ లైట్లు, ర్యాలీలు జరుగుతున్నా.. ఎందుకీ దుర్ఘటనలు ఆగడం లేదని అమె ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more