Our family has a patent on crying: HD Kumaraswamy ‘ఔను.. కన్నీళ్లు మా పేటెంట్.. మీలా మొసలికన్నీరు కాదు..’

Our family has patent over shedding tears hd kumaraswamy

HD Kumaraswamy, DV Sadananda Gowda, shedding tears, bypolls in Karnataka, bs yediyurappa, Husnur, Mysuru, Karnanataka bypolls, Karnataka, politics

“Yes, our family has a patent over shedding tears. I get emotional when I see people going through difficulties in life. Tears are a natural expression of the pain I feel for them. But Sadananda Gowda has come from the party that only knows to play drama. He has no feelings for the poor,” Kuamaraswamy said.

‘ఔను.. కన్నీళ్లు మా పేటెంట్.. మీలా మొసలికన్నీరు కాదు..’

Posted: 11/29/2019 01:14 PM IST
Our family has patent over shedding tears hd kumaraswamy

ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని గేలి చేయబోయి అధికార పార్టీకి చెందిన నేత డివి సదానంద గౌడ్ బొక్కబోర్లా పడ్డారు. సదానంద చేసిన వ్యాఖ్యలను కూడా తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కుమారస్వామి పైచేయి సాధించారు. అంతేకాదు తమ కార్యకర్తలతో పాటు ఓటర్ల మన్ననలను కూడా అందుకున్నారు. సరిగ్గా మరో వారం పది రోజుల్లో ఉపఎన్నికల ముందు బీజేపి నేతలకు ఎదురుదెబ్బలు తగలడం చర్చనీయాంశంగా మారుతోంది. అసలే ప్రభుత్వ మనుగడకు ఈ ఎన్నికలకు వున్న బంధంతో అటు బీజేపి ఇటు ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి.

కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 15 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో.. ఖాళీ అయిన ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాండ్యా లోక్ సభ నియోజకవర్గానికి వెళ్లిన కుమారస్వామి.. అక్కడి ప్రజలు తనను వీడిపోయారి కొంత భావోద్వేగానిక గురయ్యారు. తన కుమారుడిని నిఖిల్ ను ఇక్కడి నుంచి బరిలో నిలిపితే.. ప్రత్యర్థిని గెలిపించారని వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి పదవి వద్దూ ఏమీ వద్దని, తనకు మాండ్యా ప్రజల అశీస్సులు కావాలని ఆయన కోరారు.

ఈ నేపథ్యంలోనే కుమారస్వామిపై బీజేపి నేతలంతా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే మరో అడుగు ముందుకేసిన కేంద్రమంత్రి సదానంగ గౌడ దానిపై స్పందిస్తూ.. కన్నీళ్లు పెట్టుకోవడం వారి కుటుంబానికి అలావాటేనని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలప్పుడే కుమారస్వామికి కన్నీళ్లొస్తాయి. ఆయన వద్ద ఎప్పుడూ విక్స్‌, అమృతాంజన్‌ ఉంటాయి’ అని మరో వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కుమారస్వామి కేంద్ర మంత్రి డి.వి.సదానందగౌడపై కుమార నిప్పులు చెరిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు.

కుమారస్వామి ఏమన్నారంటే ‘‘పేదల కష్టాలకు స్పందించే హృదయం మాది కాబట్టి కన్నీళ్లొస్తాయి. కన్నీళ్లు మా మేథోహక్కు’’ అని  సమర్థించుకున్నారు. అవసరమైతే కేంద్ర గూఢచార సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తే మా ఇంటివద్ద బారులుదీరిన పేదలు కనిపిస్తారన్నారు. నాటకాలు ఆడే మీలాంటి వాళ్లకు కన్నీటి విలువ తెలియదని తనపై వచ్చిన విమర్శలను కుమారస్వామి తిప్పికొట్టారు. మావి సహజమైన కన్నీరు.. బీజేపి నేతలవి గ్లిజరిన్‌ కన్నీరని వ్యాఖ్యానించిన ఆయన.. సదానంద గౌడవి మాత్రం మొసలికన్నీరేనని తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles