తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో మరోమారు ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇస్తూ ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. దీంతో రమారమి ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆరు మాసాల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల స్థాయిలో మరోమారు పురపాలక ఎన్నికలకు నగరా మ్రోగనుంది. ఈ సందర్బంగా మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలపై విధించిన స్టేను ఎత్తివేసినట్లు స్పష్టం చేసిన న్యాయస్థానం.. వాటిలో కూడా ఎన్నికలు జరిపించేందుకు అనమతిని మంజూరు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణపై జులైలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్ను ఈ సందర్భంగా కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించిన న్యాయస్థానం ఆ తదనంతరం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని న్యాయస్థానం ఈ ప్రభుత్వానికి రెండు వారాల సమయాన్ని సూచించింది.
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలపై గత కొన్ని నెలలుగా హైకోర్టులో వాదప్రతివాదనలు జరుగుతున్న నేపథ్యంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ ఈ కేసులో తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వెలువరించిన క్రమంలో రాష్ట్రంలోని 13 మునిసిపల్ కార్పోరేషన్లకు, 121 మునిసిపాలిటీలకు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే వీటిలో జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషనక్లకు కాల పరిమితి ముగియలేదు. వీటితో పాటు సిద్దిపేట, అచ్చంపేట మునిసిపాలిటీలకు పదవీకాలం ముగియలేదు.
ఇక మరో ఐదు పురపాలక సంఘాల్లో పలు కారణాల చేత ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికల నగరా మ్రోగిన తరుణంలో వీటిని మినహాయించి మిగతా అన్ని పురపాలక సంఘాల పరిధిలో ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు సమాయత్తం కానున్నాయి. కాగా, ఈ సంవత్సరం జనవరి 1 నాటికి నమోదైవున్న ఓటర్ల జాబితా ప్రకారమే మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more