మహారాష్ట్రలోని రాజకీయ పార్టీని నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు ఓ వర్గంతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపికి తీరుకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు ఉభయసభలను స్థంభింపజేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. లేచి.. తాను ఇవాళ హౌజ్ లో ఓ ప్రశ్నను అడగాలని అనుకుంటున్నానని.. అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఈ తరుణంలో ఈ ప్రశ్న అడగటం అసలు అర్థరహితమని భావిస్తున్నానని అన్నారు.
దీంతో కాంగ్రెస్ సభ్యలు వెల్ లోకి చోచ్చుకెళ్లి మహారాష్ట్రలో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై నిరసనను వ్యక్తం చేశారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో లోక్ సభలోకి పెద్ద బ్యానర్ పట్టుకుని వచ్చి.. నిరసన తెలుపుతున్న ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు హిబి ఈడెన్, టీఎన్ ప్రథాపన్ లను స్పీకర్ ఓం బిర్లా సభను బయటకు వెళ్లాల్సిందిగా అదేశించారు. అయితే వారు నిరసన కొనసాగిస్తుండగా, వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించారు. ఈ క్రమంలో మార్షల్స్ కు, కాంగ్రెస్ ఎంపీలకు మధ్య తొపులాట జరిగింది.
సభలో తీవ్ర గంధరగోళం ఏర్పడటంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబి అజాద్ నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకువెళ్లి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఎదురుగా నిలబడి గట్టిగా నినాదాలు చేశారు. మహారాష్ట్ర లో బీజేపి చేసింది ప్రజాస్వామ్య ఖూనీ అంటూ నినదించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో రాజ్యసభను మధ్యహ్నాం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
కాగా, అంతకుముందు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో శివసేన, ఎన్సీపి సభ్యులు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్దకు చేరకుని మహారాష్ట్రలో అధికార పార్టీ ప్రోద్భలంతో జరుగుతున్న రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా నినదించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ సోనియా గాంధీ నినదించారు. అమెతో మూడు పార్టీల నేతలు గళం కలిపారు. అంతకుముందు పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై 10 జనపథ్ లో సోనియాగాంధీ.. పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more