కేంద్రంలో రెండో పర్యాయం కొలువుదీరిన నరేంద్రమోడీ సర్కార్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకోనుందా.? ఈ సారి కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగులను టార్గెట్ చేసిందా.? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులకు షాక్ ఇవ్వనుంది. ఇన్నాళ్లు కాలర్ ఎగరేస్తూ మేము కేంద్రప్రభుత్వ ఉద్యోగులం.. కేవలం ఎనమిది గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తాం.. ఇక ఆ తరువాత మాకు పనులకు సంబంధమే లేదు అన్నట్లు వ్యవహరించే ఉద్యోగులతో పాటు ప్రైవేటు కంపెనీల కార్మికులు, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు.. సుపరిచితమైన విషయాన్ని ఇకపై అధికారికంగా అమల్లోకి తీసుకురానుంది కేంద్రం.
అదేంటి అంటారా.. ఉద్యోగుల కనీస పనిగంటలు మారనున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న పనిగంటలు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలుగా మార్చనుంది కేంద్రం. వేతన కోడ్-2019 అమలులో భాగంగా కనీస వేతనాలు, కరవుభత్యం, పనిగంటలు, తదితర కార్మిక హక్కులకు సంబంధించి కేంద్రం నిబంధనలు జారీ చేసింది. ఇందులో భాగంగా కార్మికుల పనిగంటల సెక్షన్ 13, సబ్ సెక్షన్ (1) క్లాజ్ (ఎ) లోని మార్పులు చేయనుంది. వేతన కోడ్లో భాగంగా సాధారణ పనిదినంగా పరిగణించాలంటే తొమ్మిది గంటలని పేర్కొంది. ఒకవేళ విరామ సమయం ఎక్కువగా ఇచ్చినపుడు 12 గంటలు దాటి సాధారణ పనిదినం ఉండటానికి వీల్లేదని అంది.
కనీస వేతనాల ఖరారుకు ఆరు ప్రమాణాలను నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర కార్మికశాఖ... వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు తమ అభిప్రాయాలను ఈ నెలాఖరులోగా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it., This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. ఈ-మెయిల్ ద్వారా పంపించాలని వెల్లడించింది. కార్మికుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాక వీటిని మరోమారు పరిశీలించి పనిగంటల పెంపుపై ఒక నిర్ణయానికి రానుంది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ. కాగా వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్మికులకు మాత్రం ఈ నిబంధల్లో మార్పులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని తెలిపింది.
అయితే పనిగంటల పెంపు మినహాయించి పారిశ్రామిక చట్టం 1948లో ఎలాంటి మార్పులు వుండవబోవని తెలిపింది. ఇక కనీసం వేతనాల కోడ్ లో కూడా పలు మార్పులు చేసింది. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు కలిపి (కార్మికుడు, భార్య, ఇద్దరు పిల్లలు) రోజుకి కనీసం 2700 కేలరీల ఆహారం, ఏడాదికి 66 మీటర్ల వస్త్రం ప్రామాణికంగా నిర్ణయించనుంది. ఈ రెండింటికి అయ్యే ఖర్చులో 10 శాతాన్ని ఇంటి అద్దెగా, 20 శాతాన్ని ఇంధనం, విద్యుత్తు, ఇతర ఖర్చులుగా లెక్కించనుంది. కనీస వేతనంలో 25 శాతం పిల్లల విద్య, వైద్యం, వినోదం, ఇతర ఖర్చుల కింద తీసుకుని నిర్ణయించాలని నిబంధనల్లో కార్మికశాఖ పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Dec 09 | ముంబైలో బార్ గాళ్స్ ను చెప్పులు లేకుండా పోలిస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ముంబై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణను అదేశించారు. ముంబై లాంటి ప్రాంతాల్లో బార్లలో బార్ గాళ్స్ ను... Read more
Dec 09 | అది 2012, డిసెంబర్ 16వ తేదీన.. తనను కట్టుకోబోయేవాడితో పాటు ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన పారామెడికల్ వైద్య విద్యార్థినికి ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ఇందుకు కారణమైన ఆరుగురిలో నలుగురికి అదే... Read more
Dec 09 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ... Read more
Dec 09 | ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఔత్సాహికులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే తరుణం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీని వచ్చే నెలలో... Read more
Dec 09 | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పెద్దల నానుడి. అలాంటి ఉల్లి ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీస్తోందని మాత్రం ఎవ్వరూ ఊహించివుండరు. కానీ అదే జరుగుతోంది. ఉల్లి ధరకు రెక్కలు వచ్చి..... Read more