ఎయిర్ టెల్ ఫోన్ వాడుతున్నారా..? లేక మీరు వొడాఫోన్ కస్టమరా.? మీరు పోస్టు పెయిడ్ కస్టమరా.? లేక ప్రీ ఫెయిడ్ ఖాతాదారా.? ఏదైనా కానీవ్వండీ కానీ.. ఈ డిసెంబర్ మొదలు మీ జేబుకు చిల్లు పెట్టేందుకు మేమున్నాయని అంటున్నాయి మీ ఫోన్ కంపెనీలు. అదేంటి అంటే.. ఈ రెండు కంపెనీలు కూడబలుకుకుని మూకుమ్మడిగా తమ కస్టమర్లకు వాతపెట్టేందుకు సిద్దమయ్యాయి. తాము ఎదుర్కోంటున్న తీవ్ర నష్టాల నుంచి తప్పించుకునేందుకు డిసెంబర్ 1 నుంచి తమ టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
రిలయన్స్ జియో రాకతో వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితంగా ఇస్తూవచ్చిన కంపెనీలు.. అప్పటివరకు వున్న చార్జీలు, ప్లాన్ వివరాలను పక్కనబెట్టి.. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాయి. అయితే అప్పటి వరకు వేసిన చార్జీలు వసూళ్లయిన లాభాలను మాత్రం దాచిపెడుతూ.. ఆర్థిక సంక్షోభం అన్న పేరుతో ధరల పెంపుకు శ్రీకారం చుట్టాయి. డిసెంబర్ 1 నుంచి పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందని కంపెనీ పేర్కొన్నాయి. ఇకపై కస్టమర్లను కాల్ చార్జీల పెంపు రూపంలో బాదేయనున్నాయి.
ఇరు కంపెనీలు నిమిషాల వ్యవధిలో టారిఫ్ ధరల పెంపును ప్రకటించడం విశేషం. దీంతో ఇరు కంపెనీలు కుమ్మక్కై ధరలను పెంచుతున్నాయా? అనే ప్రశ్నలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా భారతి ఎయిర్ టెల్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘టెలికం రంగంలో మూలధన పెట్టుబడులు అవసరం. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెడుతూనే వెళ్లాలి’ అని భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెల ఆరంభమే ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నామని తెలిపింది.
వొడాఫోన్ కూడా ఎయిర్టెల్ దారిలో నడిచింది. డిసెంబర్ 1 నుంచి టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారీ నష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మద్దతు లభించకపోతే కార్యకలాపాలు కొనసాగించడం కష్టమేనని వొడాఫోన్ ఇప్పటికే సంకేతాలు పంపింది. వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కంపెనీల సంయుక్త నష్టాలు ఈ క్యూ2లో ఏకంగా రూ.74,000 కోట్లుగా ఉన్నాయి. ఏజీఆర్ బకాయిల కేటాయింపు ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఇరు కంపెనీలు తన మనుగడ కోసం టారిఫ్లను పెంచుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more