వివాదాస్పద స్వామిజీగా చరిత్రకెక్కిన నిత్యానంద చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోందా.? అంటే ఔనన్న సంకేతాలే వినిపిస్తున్నాయి. ఆయన ఆశ్రమంలో వున్న తన ఇద్దరు కుమార్తెలను విడిపించి తమకు అప్పగించాలని కోరుతూ వారి తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. స్వామిజీ ఆశ్రమంలో తమ కూతుళ్లను నిర్బంధించి.. వారిని భయాందోళనకు గురిచేస్తున్నారని వారు న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కోన్నారు. తమ కూతుళ్లను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి.. తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హెడియస్ కార్పస్ దాఖలు చేసారు.
అటు గుజరాత్ తో పాటు ఇటు కర్ణాటక, దక్షిణ భారతవనిలో ఈ వార్త సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన జనార్థన శర్మ దంపతుల సంతానమైన నలుగురు కూతుళ్లను 2013లో బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమంలో చేర్పించారు. నిత్యానంద ఆశ్రమానికి చెందిన రెసిడెన్షియల్ విద్యాసంస్థలో వారు విద్యాబుద్దులు నేర్చకుంటారని వారు భావించారు. అప్పటి నుంచి అక్కడికి వెళ్లి వస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో జనార్థన్ శర్మ నలుగురు కూతుళ్లను నిత్యానంద ధాన్యపీఠం నుంచి అహ్మదాబాద్ లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు.
కర్ణాటకకు చెందిన తాము తమ కూతుళ్లను చూసేందుకు ప్రతీసారి గుజరాత్ వెళ్లి రావడం కష్టమని వారిని చెప్పి.. తిరిగి కర్ణాటకకు రప్పించాలని వారు ఆశ్రయ నిర్వాహకులకు విషయాన్ని చెప్పినా.. వారు పెడచెవిన పెట్టారు. తమకు కనీస సమాచారం లేకుండా కర్ణాటకలోని నిత్యానంద ద్యానఫీఠం నుంచి ఎలా గుజరాత్ లోని యోగిని సర్వజ్ఞానపీఠం ఆశ్రమానికి బదిలీ చేస్తారని ప్రశ్నించినా.. అది కాస్తా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు అన్న చందంగా మారింది. ఈ ప్రశ్నలకు అక్కడి ఆశ్రమ అధికారుల నుంచి ఎలాంటి బదులు లేదు. వ్యయప్రయాసలకోర్చి వారు గుజరాత్ వెళ్లిగా అక్కడి అధికారులు ఆయనను తమ కూతుళ్లను కలిసేందుకు అనుమతించలేదు.
తమ కూతుళ్లను కలిసేందుకు వచ్చామని జనార్థన్ శర్మ దంపతులు చెప్పినా.. సర్వఙ్ఞాన పీఠం అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించిన జనార్థన్ శర్మ దంపతులు వారి సహాయంతో ఆశ్రమానికి వెళ్లి తమ ఇద్దరు మైనర్ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే అదే ఆశ్రమంలో వున్న మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) తల్లిదండ్రులతో వచ్చేందుకు నిరాకరించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన శర్మ దంపతులు.. తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తమ కూతుళ్లు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more