రోడ్డు ప్రమాదం జరిగినా.. తమ బిజీ పనులకు బ్రేక్ వేయలేని వారు కొందరైతే.. వొరేయ్ ఎందుకురా అంత తొందరా.? అంటూ నిట్టూర్చుతూ వెళ్లేవారు మరికొందరు. ఇలా ఎవరికి వారు తమ షెడ్యూలు ఎక్కడ మిస్ అవుతుందో అంటూ కంగారుగా తమ పనులపై వెళ్లేవారే ఈ కాలంలో అధికం. అయితే ప్రమాదం జరిగిని తెలిసి.. హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించి.. తాము ఏం చేశామన్న విషయాన్ని కూడా గోప్యంగానే వుంచేవారు మరికొందరు. ఇలా నేటితరంలో ఎంతో వత్యాసం.
అయితే.. అసలు ప్రమాదాలు జరిగితే ఎంతో నష్టం.. అలాంటివి దరిచేరకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించండీ.. హెల్మెట్ ధరించండీ.. సీటు బెల్టు ధరించండీ అంటూ ప్రచారం చేస్తున్నవారు కేవలం ట్రాఫిక్ పోలీసులే. అయితే మధ్యప్రదేశ్ లో ఇండోర్ పట్టణంలో మాత్రం ట్రాఫిక్ పోలీసులకు జతకలసింది ఓ ఎంబీఏ విద్యార్థిని. అమె తనదైన శైలిలో ట్రాఫిక్ అవేర్ నెస్ ఉద్యమాన్ని చేపట్టింది. అంతేకాదు.. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ను తనదైన స్టైలిష్ కదలికలతో పంపించడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో అమె ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే.. అమె పేరు షుబీ జైన్. ఇండోర్ నగరంలోని రోడ్లపై వాహనదారులకు జాగ్రత్తలు చెబుతూ వారిని సురక్షితంగా ఉండాలని హితబోధ చేస్తుంది. షుబీ జైన్ చెప్పే విధానం ఓ సంగీత నృత్యరూపకం తరహాలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తన ప్రచార కార్యక్రమానికి కాస్తంత డ్యాన్స్ కూడా జోడించి షుబీ చేస్తున్న విజ్ఞప్తులకు వాహనదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆమె నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ స్ఫూర్తి పొందాడో ఏమో కానీ ఆయన కూడా డ్యాన్స్ మూమెంట్స్ తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తూ దర్శనమిచ్చాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#WATCH Madhya Pradesh: An MBA student Shubi Jain volunteering to manage traffic on roads in Indore in her unique way, to spread awareness about traffic norms & regulations. pic.twitter.com/hBZd0bt3C5
— ANI (@ANI) November 18, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more