కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది చెందిన పవిత్ర పుణ్యధామం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే భక్తుల సంఖ్య దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో తిరుమలను సందర్శించే భక్తులతో వడ్డీకాసులవాడి దర్శనానికి కూడా గంటల కొద్ది సమయం పడుతొంది. అయితే ఎలాంటి రద్దీ.. గట్రా లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుని ఎంచక్కా తిరుగుపయనం కావాలని అని భావించే భక్తులకు మాత్రం ఇది నిజంగా శుభవార్తే. వెంకన్న దర్శనం చేసుకుని వెనుదిరగాలని అనుకునే భక్తులకు ఇది అత్యంత సౌకర్యవంతమైన పయనం.
అదేంటీ అంటే. హైదరాబాద్ నుంచి తిరుమల వెంకన్న స్వామిని దర్శంచుకోవాలని తలిచే భక్తులకు ఐఆర్సీటీసీ ఒక బృహత్తర ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే రైలు ద్వారా తిరుమలకు ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఇప్పుడు ఫ్లైట్లో భక్తులను తిరుపతికి తీసుకెళ్తోంది. 'తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. నవంబర్ 15, నవంబర్ 22, నవంబర్ 29, డిసెంబర్ 6, డిసెంబర్ 27 తేదీల్లో ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
భక్తులు ఐఆర్సీటీసీ టూరిజంకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేసి ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీ ప్రారంభ ధర ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.10970, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11780. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి ఏసీ హోటల్లో అకామడేషన్, 1 బ్రేక్ఫాస్ట్, 2 లంచ్, 1 డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఇక రైలు ప్రయాణంలో శ్రీవారి దర్శనం పొందాలంటే అందుకు మరో ప్యాకేజీ కూడా అందుబాటులో వుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలో బాగంగా భక్తులు సాయంత్రం 6 గంటలకల్లా రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి థర్డ్ ఏసీలో భక్తుల తిరుమల ప్రయాణం ప్రారంభమవుతొంది. మరుసటి రోజు ఉదయం ఆరు గంటల సమయానికి భక్తులు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారిని హోటల్ కు తీసుకెళ్లి.. అక్కడ మూడు గంటల సమాయాన్ని వారు ప్రెష్ అయ్యేందుకు ఇస్తుంది. ఉదయం 9.30 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి తిరుమలకు చేరుకుంటుంది. ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని భక్తులు మధ్యాహ్నం 1.30 గంటలకల్లా బస్సులోకి చేరుకోవాలి. ఇక కొండ దిగిన వెంటనే భోజనం చేసుకున్నా.. సాయంత్రం రైల్వేస్టేషన్ వద్ద నారాయణాద్రి ద్వారా తిరుగుప్రయాణం కల్పిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more