మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడుస్తున్నా.. నూతన ప్రభుత్వం ఏర్పాటులో బీజేపి, దాని మిత్రపక్షమైన శివసేన పార్టీలు బెట్టు వీడకపోవడంతో పీఠముడి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు మహారాష్ట్ర ఓటర్లు ఇచ్చిన ప్రజాతీర్పును శిరసావహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిపోయి అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పును వమ్ము చేస్తున్నారని ఆ పార్టీ నేత నితిన్ రౌత్ విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక అర్హతే లేదని మండిపడ్డారు.
శివసేన, బీజేపి కూటమికి ప్రజలు అధికారం అందిస్తే వారు ప్రజల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు రెండు పార్టీలు రాష్ట్ర అభివృద్దికి తాము పాటుపడతామని, రైతు సమస్యలను పరిష్కారిస్తామని హామి ఇచ్చారని, ప్రస్తుతం పక్షం రోజుల నుంచి అధికార దాహంతో అల్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇది మహారాష్ట్ర ప్రజాతీర్పును అవమానించడమేనని అన్నారు. పక్షం రోజులుగా ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని అన్నారు.
కాగా ఎమ్మెల్యేల కోసం బేరసారాలు సాగుతున్నట్టు శివసేన చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేనే స్వయంగా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆందోళన చెందుతోంది. బీజేపీ నైతికంగా ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టి అర్థమవుతోంది. అందుకే వారి నుంచి మహారాష్ట్రను కాపాడాలి. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక హక్కు మహాయుతికి (బీజేపీ + శివసేన కూటమి) ఉందా?’’ అని కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ తన ఎమ్మెల్యేల్ని జైపూర్కు తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ సభ్యులకు డబ్బు ఇవ్వజూపేందుకు బీజేపి యత్నిస్తోందన్న సమాచారం అందిందని.. అందుకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే తమ ఎమ్మెల్యేలకు బీజేపి ఎరవేసే అవకాశమే లేదని కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దళ్వాయి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పార్టీ ఫిరాయించిన కొందరు నేతలు తిరిగి రావాలని యోచిస్తున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఎన్సీపీతో కలిసే తీసుకుంటుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more