కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది చెందిన పవిత్ర పుణ్యధామం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే భక్తుల సంఖ్య అసంఖ్యాకంగా దినదినప్రవర్తమానంగా పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో తిరుమలను సందర్శించే భక్తులు వడ్డీకాసలు వాడికి ముడుపులు చెల్లించడం కూడా పరిపాటే. భక్తులు తమ ఇష్టపూర్వకంగా ఇచ్చే నిధులతో ఏం చేయాలా.? అని టీటీడీ బోర్డు పలు సందర్భాలలో మేధోమధనం చేసి.. ఓ నిర్ణయానికి వస్తున్న ఘటనలు కూడా మనం చూశాం. అయితే భక్తుల ఇచ్చేది అటుంచితే.. వారి నుంచి ఎలా అధికంగా వసూలు చేయాలన్న అన్న విషయమై టీటీడీ దృష్టిసారించిందా.? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
మరీ ముఖ్యంగా సామాన్యభక్తులను టార్గెట్ చేసిన టీటీడీ బోర్డు ఇక ఆదాయాన్ని పెంచుకోవడమే తమ పరమావధిగా నిర్ణయం తీసుకుంది. తిరుమలలో సామాన్య భక్తులు ఒకటి రెండు రోజుల పాటు బస చేసే అతిధి గృహాల అద్దెలను అమాంతం పేంచేసింది. పెరిగిన ధరలన్నింటినీ ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తెచ్చింది. నందకం అద్దె గదుల ధరలు ఇప్పటివరకు రూ.600గా ఉండేవి.. ఇప్పుడు రూ.1000కి పెరిగాయి. కౌస్తుభం, పాంచజన్యంలో అద్దె గదుల ధరలు రూ.500 నుంచి రూ.1000కి పెరిగాయి. వేంకటేశ్వరుడి భక్తులకోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.3000 వరకు వసతి సదుపాయం ఉంది.
రూ.100, రూ.500, రూ.600కు లభించే గదులను సాధారణ వసతి కింద లెక్కిస్తారు. అయితే సామాన్య భక్తులను ఇబ్బందుల పాలు చేసేలా టీటీడీ నిర్ణయం వుంది. ఇప్పటికే ఫుణ్యధామాలన్ని కాసులు రాలే కమర్షియల్ కేంద్రాలేనన్న విమర్శలు వస్తున్న క్రమంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, రూ.999, రూ.1500తో లభించే గదుల్లో ఏసీ సదుపాయం ఉంటుంది. సామాన్యులు అధికంగా రూ.100కి వచ్చే వసతి గదుల్లో అత్యధికంగా ఉంటారు. ఆ గదులు దొరకకపోతే రూ.500, రూ.600 చెల్లించి సాధారణ వసతి గదల్లో ఉంటారు. కాగా, తిరుమలలో వసతి గదుల ధరలను పెంచినప్పటికీ తిరుపతిలో మాత్రం పెంచలేదు. రూ.100, రూ.200, రూ.300, రూ.400, రూ.600, రూ.800, రూ.1000కు లభ్యమయ్యే వసతి గదులను ఎప్పటిలాగే భక్తులు పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more