కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది చెందిన పవిత్ర పుణ్యధామం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే భక్తుల సంఖ్య అసంఖ్యాకంగా దినదినప్రవర్తమానంగా పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో తిరుమలను సందర్శించే భక్తులు వడ్డీకాసలు వాడికి ముడుపులు చెల్లించడం కూడా పరిపాటే. భక్తులు తమ ఇష్టపూర్వకంగా ఇచ్చే నిధులతో ఏం చేయాలా.? అని టీటీడీ బోర్డు పలు సందర్భాలలో మేధోమధనం చేసి.. ఓ నిర్ణయానికి వస్తున్న ఘటనలు కూడా మనం చూశాం. అయితే భక్తుల ఇచ్చేది అటుంచితే.. వారి నుంచి ఎలా అధికంగా వసూలు చేయాలన్న అన్న విషయమై టీటీడీ దృష్టిసారించిందా.? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
మరీ ముఖ్యంగా సామాన్యభక్తులను టార్గెట్ చేసిన టీటీడీ బోర్డు ఇక ఆదాయాన్ని పెంచుకోవడమే తమ పరమావధిగా నిర్ణయం తీసుకుంది. తిరుమలలో సామాన్య భక్తులు ఒకటి రెండు రోజుల పాటు బస చేసే అతిధి గృహాల అద్దెలను అమాంతం పేంచేసింది. పెరిగిన ధరలన్నింటినీ ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తెచ్చింది. నందకం అద్దె గదుల ధరలు ఇప్పటివరకు రూ.600గా ఉండేవి.. ఇప్పుడు రూ.1000కి పెరిగాయి. కౌస్తుభం, పాంచజన్యంలో అద్దె గదుల ధరలు రూ.500 నుంచి రూ.1000కి పెరిగాయి. వేంకటేశ్వరుడి భక్తులకోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.3000 వరకు వసతి సదుపాయం ఉంది.
రూ.100, రూ.500, రూ.600కు లభించే గదులను సాధారణ వసతి కింద లెక్కిస్తారు. అయితే సామాన్య భక్తులను ఇబ్బందుల పాలు చేసేలా టీటీడీ నిర్ణయం వుంది. ఇప్పటికే ఫుణ్యధామాలన్ని కాసులు రాలే కమర్షియల్ కేంద్రాలేనన్న విమర్శలు వస్తున్న క్రమంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, రూ.999, రూ.1500తో లభించే గదుల్లో ఏసీ సదుపాయం ఉంటుంది. సామాన్యులు అధికంగా రూ.100కి వచ్చే వసతి గదుల్లో అత్యధికంగా ఉంటారు. ఆ గదులు దొరకకపోతే రూ.500, రూ.600 చెల్లించి సాధారణ వసతి గదల్లో ఉంటారు. కాగా, తిరుమలలో వసతి గదుల ధరలను పెంచినప్పటికీ తిరుపతిలో మాత్రం పెంచలేదు. రూ.100, రూ.200, రూ.300, రూ.400, రూ.600, రూ.800, రూ.1000కు లభ్యమయ్యే వసతి గదులను ఎప్పటిలాగే భక్తులు పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Feb 25 | కరోనా మహమ్మారి మానవాళిపై సృష్టించిన కష్టకాలాన్ని పక్కనబెడితే.. దాని పేరుతో ఇప్పుడు దేశంలో ధరఘాతం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు సెంచరీ మార్కుకు చేరుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే... Read more
Feb 25 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లోని ప్రజల ధనంతో ఆర్థిక నేరానికి పాల్పడి.. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూనైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ కోర్టు షాకిచ్చింది. గత రెండున్నరేళ్లుగా... Read more
Feb 25 | కార్మికుల సమస్యల పరిష్కారించేందుకు, వారి సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగాల్పిన కార్మిక నేత దారి తప్పాడు. కార్మిక నేత హోదాలో తోటి కార్మికుడికి తానే సమస్యగా మారాడు. తన కాలనీలోనే నివాసం ఉంటున్న మరో... Read more
Feb 25 | అమ్మాయిల కాలేజీకి వద్ద కోతుల బ్యాచ్ తిష్ట వేసింది. ఉదయం, సాయంకాలలతో పాటు రాత్రి వేళ్లలోనూ అక్కడే అవాసాన్ని ఏర్పాటు చేసుకుని కాలేజీ విద్యార్థినులతో పాటు ఉపాద్యాయులను కూడా వేధిస్తున్నాయి. ఈ కోతుల బ్యాచ్... Read more
Feb 25 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఎన్నికలను జరగనున్న కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ.. అక్కడి కొల్లాం జిల్లాలోని మత్య్సకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రయానం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సముద్రంలో... Read more