ఆవు పాలల్లో బంగారం ఉందని బీజేపీ ముఖ్యనేత చేసిన వ్యాఖ్యలతో ఓ బెంగాల్ రైతు పూర్తిగా విశ్వసించాడు. పాలలో బంగారం ఎలా వుంటుందన్న అలోచన కూడా చేయకుండా ఏకంగా తన వద్ద ఉన్న రెండు ఆవులను తీసుకుని సమీపంలోని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీకి వెళ్లాడు. తన వద్ద రెండు గోవులు వున్నాయని వాటిపై గోల్డ్ లోన్ ఇవ్వాలని నిష్కల్మషంగా అభ్యర్థించాడు. వచ్చే రుణంతో మళ్లీ తాను గోవులనే కొంటానని, నమ్మకంగా చెప్పిన వింత ఉదంతం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దన్కునీ గ్రామంలో వెలుగుచూసింది.
భారత జాతికి చెందిన ఆవు పాలల్లో బంగారం ఉందని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ వ్యాఖ్యాలతో స్పూర్తి పొందిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దన్కునీకి చెందిన ఓ యువ రైతు తన వద్ద ఉన్న రెండు ఆవులను మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ శాఖకు తీసుకు వచ్చి చూపించి, వీటిపై గోల్డ్ లోన్ ఇవ్వాలని కోరాడు. ‘‘ఆవు పాలల్లో బంగారం ఉందని నేను విన్నాను. ఈ రెండు ఆవులే నా కుటుంబానికి జీవనాధారం. అందుకే బంగారం పాలు ఇస్తున్న రెండు ఆవులను తీసుకువచ్చాను...నాకు వీటిపై గోల్డ్ లోన్ ఇస్తే మరో 20 ఆవులు కొని నా వ్యాపారాన్ని విస్తరిస్తాను’’ అని బెంగాల్ కు చెందిన యువ రైతు మణప్పురం ఫైనాన్స్ ఉద్యోగులను అభ్యర్థించాడు.
బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలతో ప్రతిరోజూ రైతులు వచ్చి తమ వద్ద ఉన్న ఆవులపై ఎంత రుణం వస్తుందని ప్రశ్నిస్తున్నారని గరల్ గాచా గ్రామ పంచాయతీ ప్రధాన్ మనోజ్ సింగ్ చెప్పారు. తమ ఆవు రోజుకు 15 నుంచి 16 లీటర్ల పాలు ఇస్తుందని, పాలల్లో బంగారం ఉన్నందున తమ ఆవులపై ఎంత గోల్డ్ లోన్ వస్తుందని రైతులు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆవు పాలల్లో బంగారం ఉందని కనుగొన్న దిలీఫ్ ఘోష్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని గ్రామ ప్రధాన్ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more