నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్యనేత, తెలంగాణ ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవితపై సింగరేణి కార్మిక సంఘం నాయకుడు కెంగర్ల మలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ స్ఫూర్తితో తాను ముందుకువస్తే.. పైరవీకారులను తెలంగాణ ఉద్యమ నేతలు ముందుకు తీసుకెళ్లారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులోనూ కవితను నమ్మి తాము తీవ్రంగా నష్టపోయానని చెప్పుకోచ్చారు. డబ్బుపోతే ఫర్వాలేదని చెప్పిన ఆయన.. అమె వల్ల తాను మనసిక క్షోభకు కూడా గురయ్యామని మల్లయ్య ఆరోపించారు.
కవిత కారణంగానే తానిప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) కార్మికసంఘం కండువా కప్పుకోవాల్సి వచ్చిందని కెంగర్ల మల్లయ్య వ్యాఖ్యానించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే బొగ్గుగని కార్మిక సంఘాని స్థాపించి, దానికి నాయకత్వం వహించానని చెప్పారు. అయితే తనను ఎన్నో అవమానాలకు గురి చేశారని.. అడుగడుగునా తాను పరాభవాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తే.. వాళ్లు ఫైరవీకారులకు పగ్గాలను అప్పగించారని అరోపించారు.
చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరినట్లుగా.. టీబీజీకేఎస్లో చొరబడ్డ కొన్ని శక్తులు యూనియన్ను చిన్నాభిన్నం చేశాయని మల్లయ్య మండిపడ్డారు. గత నెలలో కెంగర్ల మల్లయ్య తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి రాజీనామా చేసి తన అనుచరులతో కలసి బీఎంఎస్ యూనియన్లో చేరిన తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్పైనా మల్లయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్లో ఆనాటి ఉద్యమ స్ఫూర్తి లేదని... ఆయన తిరిగి ఆ స్పూర్తిని పొందడం సాధ్యంకాదని వ్యాఖ్యానించారు. సింగరేణిలోని టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్కు కవిత గతంలో గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more