ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్ తగిలింది. తన సొంత నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచిన ఆయనను.. అదే నియోజకవర్గానికి చెందిన గ్రామస్థులు అడ్డగించడం సంచలనంగా మారింది. ఓటు వేసి గెలిపించిన ప్రజల కష్టనష్టాలను సకాలంలో స్వయంగా తెలుసుకుని వుంటే ఇంతవరకు వచ్చేది కాదేమో. కానీ.. నిజజీవితంలోనూ వెండితెరపై వెలిగిపోయే హీరోలా ఫీలయ్యే బాలయ్యను ఆయన నియోజకవర్గం హిందూపురంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు అడ్డుకుని తమ నిరసనను తెలిపారు.
అందునా ఓ శుభకార్యానికి వెళ్తుండగా ఆయనను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అనంతపురంజిల్లా లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్తులు బాలకృష్ణను అడ్డగించారు. టీడీపీ అధికార ప్రతినిధి రమేశ్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపూరంకు వచ్చారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు చేరుకున్న బాలయ్య... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిందూపురంకు బయల్దేరారు. దీంతో బాలయ్య వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కొడికొండ చెక్ పోస్టు కాపుకాశారు. ప్రధాని రహదారిపై విద్యార్థులు, గ్రామస్థులు బైఠాయించారు.
హిందూపురం వచ్చే దారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఆయన వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. హిందూపురం నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకు భూమి పూజ చేసి దాదాపుగా సంవత్సరం అయ్యింది. అయినా కూడా ఇంతవరకు పనులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో బాలయ్య వాహనాన్ని అడ్డుకొని గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన బాలయ్య... అధికారులతో మాట్లాడి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో, గ్రామస్తులు వెనక్కి తగ్గి, బాలయ్య వాహనానికి దారి వదిలారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more