జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి.. అక్కడి పరిపాలనా పగ్గాలను కేంద్రం చేతిలోకి తీసుకున్నా.. పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. కేంద్రం అధీనంలోకి జమ్మూకాశ్మీర్ శాంతిభద్రతలు రావడంతో ఉగ్రవాదానికి చెక్ పెట్టవచ్చని భావించినా.. ప్రతీకారేచ్ఛతో రగలిపోతున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ లో తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. ఈ క్రమంలో అనంత్ నాగ్ జిల్లా, బిజ్మెహరా ప్రాంతంలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి.
కాగా, భద్రతా దళాలను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఇరువర్గాల మధ్య భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఈ ఉదయం భద్రతా దళాలు తనిఖీలు ప్రారంభించగా, ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి.
ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించిన అధికారులు.. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే సుమారు ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పలలో భారత భద్రతా దళాలు పైచేయి సాధించాయి.
ఇంట్లో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. లొంగిపోమ్మని చెప్పినా.. వినకపోవడంతో భద్రతా దళాలు వారిని మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో భారత భద్రతా దళానికి చెందిన ఓ జవాన కూడా గాయాలపాలయ్యాడు. ఇదిలావుండగా, భారత భద్రతా బలగాలు గత వారం రోజులుగా గాలిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులు మంగళవారం గాందర్బల్ అడవుల్లో పోలీసులకు పట్టుబడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more