దేశ ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో పెట్టింది పేరు. అంతేకాదు ఆయన సాహసోపేత నిర్ణయాలు తీసుకునే వరకు ఎవరికీ ఎలాంటి సమాచారం కూడా అందదు. ఇలాంటి నిర్ణయాలతో ధాయాది పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్, చేసినా.. వాయువేగంతో దాడి చేసినా అవి జరిగిన తరువాత కానీ ప్రజలకు సమాచారం తెలియదు. అయితే ప్రధాని తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? అంటే ఔనన సమాధానాలే వినిపిస్తున్నాయి.
తన హాయంలో ప్రవేశపెట్టిన రూ.2వేల నోటును బ్యాన్ చేస్తారన్న వార్తలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు పేరుతో మునుపెన్నడూ లేని విధంగా రూ.2 వేల నోటును చలామణిలోకి తీసుకువచ్చారన్న విపక్షాల విమర్శలకు ఆయన చెక్ పెట్టనున్నారా.? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల నోటు మార్కెట్ లో కనిపించడం లేదు. జనాలు రూ.2వేల నోటు చూసి చాలా రోజులే అయ్యింది.
ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా ఆర్బీఐ తాజాగా అందించిన సమాచారం కూడా కీలకమే అయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రించలేదనే నిజం వెలుగులోకి సమాచార హక్కు చట్టం కింద ఓ ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. దీంతో ఏ క్షణమైనా రూ.2వేల నోటుని రద్దు చేశాము అనే ప్రకటన ప్రభుత్వం నుంచి రావొచ్చనన్న అందోళన ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఇక ఏటీఎంలలోనూ రూ.2 వేల క్యాసెట్లు తోలగిస్తున్నారన్న వార్తలు కూడా దీనికి అజ్యం పోస్తున్నాయి,
ఆర్టీఐ సమాచారం ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను ముద్రించింది. ఆ ముద్రణ 2018-19 సంవత్సరానికి వచ్చే సరికి 46.690 మిలియన్ నోట్లకు చేరింది. 2019లో మాత్రం ఒక్క రూ.2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో రూ.2వేల నోట్లు రద్దు కానున్నాయా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more